SA vs BAN: మహ్మదుల్లా ఒంటరి పోరాటం.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
ప్రపంచకప్లో సౌతాఫ్రికా నాలుగో విజయాన్ని అందుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను సఫారీలు చిత్తుగా ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది.
ముంబయి: వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికా నాలుగో విజయాన్ని అందుకుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను సఫారీలు చిత్తుగా ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మదుల్లా (111; 111 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. లిట్టన్ దాస్ (22), తాంజిద్ హసన్ (12), నజ్ముల్ శాంటో (0), షకీబ్ అల్ హసన్ (1), ముష్పీకర్ రహీమ్ (8), హసన్ మిరాజ్ (11), నసుమ్ అహ్మద్ (19), హసన్ మహమూద్ (15), ముస్తాఫిజుర్ (11) విఫలమయ్యారు. ఒక దశలో 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. మహ్మదుల్లా పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా నిలకడగా బౌండరీలు బాది 104 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ 3, మార్కో జాన్సన్, కగిసో రబాడ, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహరాజ్ ఒక వికెట్ తీశాడు.
లక్ష్యఛేదనలో బంగ్లా మొదటి ఆరు ఓవర్లు నిలకడగానే ఆడింది. అప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మార్కో జాన్సన్ వేసిన ఏడో ఓవర్ నుంచి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ గాడితప్పింది. జాన్సన్ వరుస బంతుల్లో తాంజిద్ హసన్, శాంటోలను పెవిలియన్కు పంపాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చారు. తర్వాత వచ్చిన షకీబ్ను పేసర్ లిజాడ్ విలియమ్స్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికే ముష్పీకర్ను కొయిట్జీ వెనక్కి పంపాడు. లిట్టన్ దాస్ను రబాడ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో హసన్ మిరాజ్ పెవిలియన్ చేరాడు. నసుమ్ అహ్మద్.. కోయిట్జీకి రిట్నర్ క్యాచ్ ఇచ్చాడు. మహమూద్ను రబాడ వెనక్కి పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి పాతుకుపోయిన మహ్మదుల్లా.. ముస్తాఫిజుర్ సహకారంతో శతకం అందుకున్నాడు. సెంచరీ చేసిన మహ్మదుల్లా.. కోయిట్జీ బౌలింగ్లో మార్కో జాన్సన్కు చిక్కాడు. విలియమ్స్ వేసిన తర్వాతి ఓవర్లో ముస్తాఫిజుర్.. మిల్లర్కు క్యాచ్ ఇవ్వడంతో బంగ్లా ఆలౌటైంది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (174; 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్లు) భారీ శతకం బాదాడు. ఈ ప్రపంచకప్లో అతడికిది మూడో శతకం. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (90; 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (34*; 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడాడు. చివర్లో డికాక్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. దీంతో చివరి 13 ఓవర్లలో సౌతాఫ్రికా 174 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 2, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్