IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

నవంబర్‌ 23 నుంచి మొదలుకానున్న భారత్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

Updated : 22 Nov 2023 13:51 IST

ముంబయి: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో పరాజయం చవిచూసిన భారత్‌.. ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై మరోసారి సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్‌ 23 నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ (BCCI) తాజాగా ప్రకటించింది. గాయం కారణంగా హార్దిక్‌ పాండ్య అందుబాటులో లేకపోవడంతో సూర్యకుమార్‌ యాదవ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌ నవంబర్‌ 23న విశాఖపట్నం వేదికగా జరగనుంది. 

జట్టు సభ్యులు: సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబె, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని