BCCI President Suggestions: ఆసీస్ను తేలిగ్గా తీసుకోవద్దు.. టైటిల్ మనదే : బీసీసీఐ అధ్యక్షుడు
కోట్లాది టీమ్ఇండియా అభిమానులు ఎదురుచూస్తున్న రోజు(ODI World Cup Final) రానే వచ్చింది. ప్రపంచకప్ తుది సమరంలో విజేతగా నిలిచి మూడోసారి దేశానికి టైటిల్ అందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్డెస్క్ : ప్రపంచకప్ టైటిల్ సాధించడానికి టీమ్ఇండియా (Team India) ఒక్క అడుగు దూరంలోనే ఉంది. కోట్లాది మంది చిరకాల కలను నెరవేర్చడానికి రోహిత్ సేన సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మరికాసేపట్లో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య సగర్వంగా ప్రపంచకప్ ట్రోఫీ(World Cup Trophy)ని ముద్దాడాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు.
మరోవైపు ఇదే సమయంలో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అంత తక్కువగా అంచనా వేయొద్దని.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా టీమ్ఇండియా ఆడాలని పలువురు సూచిస్తున్నారు. ఫైనల్ పోరు ముందు బీసీసీఐ అధ్యక్షుడు (BCCI President) రోజర్బిన్నీ కూడా రోహిత్ సేనకు పలు సూచనలు చేశాడు.
ODI WC Final 2023: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
‘ఈ టోర్నీలో టీమ్ఇండియా మంచి క్రికెట్ ఆడింది. ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచాం. భారత్ ఎంతో గొప్ప ప్రదర్శన చేసింది. అయితే.. ఆస్ట్రేలియాను తేలికగా తీసుకోవద్దు. వాళ్లు కూడా బాగా ఆడుతున్నారు. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలిచారు. భారతే టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్నాను’ అని రోజర్బిన్నీ (Roger Binny) తెలిపాడు.
ఇక నేడు ప్రపంచకప్ తుది సమరం (World Cup 2023 Final) నేపథ్యంలో.. దేశమంతా ఫైనల్ ఫీవర్ పాకింది. ఎక్కడ చూసిన ఫైనల్పైనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు భారత్ టైటిల్ గెలవాలని అభిమానులు పలుచోట్ల ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!