MS Dhoni-CSK: ధోనీ భవిష్యత్పై స్పందించిన సీఎస్కే బౌలర్..
చెన్నై (Chennai Super Kings) సారథి ఎంఎస్ ధోనీ భవితవ్యంపై ఆ జట్టు బౌలర్ దీపక్ చాహర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్ : క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 17 (IPL 2024)వ సీజన్ సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అన్ని జట్లూ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఎప్పటిలానే చెన్నై (Chennai Super Kings) సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) భవితవ్యంపై చర్చ కూడా ప్రారంభమైంది. ఇదే అతడికి ఆఖరి సీజనా..?అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆ జట్టు బౌలర్ దీపక్ చాహర్ ఈ అంశంపై స్పందించాడు.
‘‘గత ఏడాది 145 కి.మీ. వేగంతో వచ్చిన బంతులను ధోనీ ఎలా సిక్స్లుగా మలిచాడో మీరు చూశారు. మేం దానిని నెట్స్లోనూ చూస్తాం. ధోనీ ఈ ఏడాది ఆడతాడు. ఈ సీజన్ అనంతరం అతడు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే.. మరో రెండేళ్లు ఆడతాడని నేను అనుకుంటున్నాను’ అని చాహర్ పేర్కొన్నాడు.
ధర్మశాలలో పడిక్కల్ అరంగేట్రం చేసేనా?
కొత్త సీజన్.. డబుల్ రోల్
ఈ ఐపీఎల్ సీజన్ కోసం ధోని మంగళవారం చెన్నైలో అడుగుపెట్టాడు. మహీ ఫొటోను సామాజిక మాధ్యమంలో పంచుకున్న సీఎస్కే ఫ్రాంఛైజీ.. ‘తలా దర్శనం’ అనే శీర్షిక పెట్టింది. ‘కొత్త సీజన్.. కొత్త పాత్ర కోసం ఎదురుచూస్తున్నా’ అని తాజాగా ఎంఎస్డీ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా ధోనీయే వివరణ ఇచ్చాడు. ‘కొత్త సీజన్.. డబుల్ రోల్’ అంటూ బుధవారం ఫేస్బుక్ పోస్టులో వీడియో పంచుకున్నాడు. అయితే.. ఈ వీడియో ఐపీఎల్ ప్రమోషన్ కోసం తీసింది కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్