IND vs ENG: కోహ్లీ ఆడనంత మాత్రాన భారత్కు నష్టం లేదు.. జీవితం ఆగిపోదు: మాజీ క్రికెటర్
ఐదు టెస్టుల సిరీస్లో (IND vs ENG) భారత్ - ఇంగ్లాండ్ 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టు రాజ్ కోట్ వేదికగా 15న ప్రారంభం కానుంది. మిగతా టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టులకు (IND vs ENG) ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ లేడు. వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. కోహ్లీ లేకపోవడం భారత్కు నష్టమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేయగా.. టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు.
‘‘కోహ్లీ జట్టులో లేకపోయినా ఇంగ్లాండ్తో సిరీస్ను భారత్ కోల్పోదని భావిస్తున్నా. నిజాయతీగా చెప్పాలంటే.. ఒకరు ఉన్నా, లేకపోయినా జీవితం ఆగిపోదు. విరాట్ లేడని కాస్త బాధ ఉండొచ్చు. ఆసీస్లో ఆ జట్టును ఓడించినప్పుడు కూడా అతడు లేడనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. అడిలైడ్ టెస్టులో కోహ్లీ ఉండి కూడా మనం ఓడిపోయాం. గబ్బాలో ఎలా గెలిచామో అందరికీ తెలిసిందే.
హైదరాబాద్, వైజాగ్ టెస్టుల్లో విరాట్ ఉండుంటే ఏదొక మ్యాచ్లో కచ్చితంగా 150+ స్కోరు చేసేవాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ ఎటాక్ వీక్గానే ఉంది. ఇలాంటి బౌలింగ్తో కోహ్లీని ఆపడం చాలా కష్టమయ్యేది. మరీ ముఖ్యంగా రెహాన్ అహ్మద్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఓ సందర్భంలో కోహ్లీ ఆడి తన బౌలింగ్లో నాలుగు బౌండరీలు కొడితే బాగుండేదని రెహాన్ చెప్పాడు. కానీ, విరాట్ కేవలం నాలుగు బౌండరీలు కొట్టేసి వికెట్ ఇచ్చి వెళ్లడు. ఇంగ్లాండ్ జట్టులో షోయబ్ బషీర్, జాక్ లీచ్, టామ్ హార్ట్లీ ఉన్నాసరే కోహ్లీ మాత్రం 50-70 పరుగులతో ఆపడు. దానిని భారీ సెంచరీగా మలుస్తాడు. అందుకే, ఇతర బ్యాటర్లతో పోలిస్తే విరాట్ భిన్నంగా అనిపిస్తాడు’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.
జట్టులోకి తీసుకోకపోవడంపై ఉమేశ్ పోస్టు..
ఇంగ్లాండ్తో సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ఉమేశ్ యాదవ్కు అవకాశం దక్కలేదు. దీనిపై ఈ భారత సీనియర్ బౌలర్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ‘‘పుస్తకాలపై దుమ్ము పేరుకుపోయినంత మాత్రాన అందులో కథలు ముగిసినట్లు కాదు’’ అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాడు. దీంతో అతడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ‘బీసీసీఐ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదే’. ‘జట్టులోకి వచ్చేందుకు అతడికి పూర్తి అర్హత ఉంది’ అంటూ స్పందనలు తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ