Gambhir: డబ్బు కోసం అలాంటి ప్రకటనలా?.. క్రికెటర్లపై గంభీర్ ఫైర్
‘పాన్ మసాలా’ యాడ్లో నటించిన క్రికెటర్లపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఫైరయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ‘పాన్ మసాలా’ యాడ్లో నటించిన క్రికెటర్లపై భారత మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఆగ్రహం వ్యక్తంచేశాడు. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉండగా.. ‘పాన్ మసాలా’ బ్రాండ్ యాడ్లు చేయడం వల్ల వాటిని చూసే కోట్లాది మంది పిల్లలకు తప్పుడు సందేశం వెళ్తుందన్నాడు. ఇటీవల టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గావాస్కర్, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్తోపాటు విండీస్ స్టార్ క్రిస్ గేల్ ఓ ‘పాన్ మసాలా’ యాడ్లో నటించారు. వీరిని ఉద్దేశించి గంభీర్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఓ క్రికెటర్ పాన్ మసాలా యాడ్ చేస్తారని నా జీవితంలో ఊహించలేదు. ఇది చాలా అసహ్యంగా ఉంది. ఈ ప్రకటనల ద్వారా మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?’’ అని గంభీర్ ప్రశ్నించాడు. అందుకే రోల్ మోడల్స్ను కాస్త జాగ్రత్తగా ఎంచుకోండంటూ అభిమానులకు సూచించాడు. ‘‘ఏ వ్యక్తయినా తాను చేసే పనితోనే గుర్తింపు పొందుతాడు. కోట్ల మంది పిల్లలు మిమ్మల్ని చూస్తుంటారు. అనుకరిస్తుంటారు. అలాంటప్పుడు పాన్ మసాలా యాడ్ చేయడం సరికాదు. డబ్బు సంపాదించడానికి ఎన్నో ఇతర మార్గాలు ఉన్నాయి. ఇలాంటివి చేసే కంటే ఆ డబ్బు వద్దని చెప్పే ధైర్యం మీకుండాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు గంభీర్.
2018 ఐపీఎల్లో గంభీర్ దిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ సీజన్లో దిల్లీ జట్టు పేలవమైన ప్రదర్శన చేయడంతో మధ్యలోనే సారథిగా బాధ్యతల నుంచి వైదొలిగాడు. అప్పుడు గంభీర్కు రూ.3 కోట్ల చెక్కు రావాల్సింది. ఆ డబ్బుకు తాను అర్హుడిని కాదని చెక్కుని తిరస్కరించాడు. ఆ విషయాన్ని ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) గురించి మాట్లాడుతూ.. ‘సచిన్కు ఓ సారి పాన్ మసాలా యాడ్ చేయడానికి రూ.20-30 కోట్లు ఆఫర్ ఇచ్చారు. కానీ అతను నో చెప్పాడు. ఆల్కహల్, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్స్ ప్రకటనలు చేయనని సచిన్ తన తండ్రికి మాటిచ్చాడు. అందుకే అతడో రోల్ మోడల్’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు