Ancy SOJAN EDAPPILLY: తండ్రి కల కోసం
అతను అథ్లెటిక్స్లో రాణించాలనుకున్నాడు. దేశానికి పతకాలు అందించాలనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితులు అతణ్ని ఆపేశాయి.
అతను అథ్లెటిక్స్లో రాణించాలనుకున్నాడు. దేశానికి పతకాలు అందించాలనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితులు అతణ్ని ఆపేశాయి. దీంతో బతుకుదెరువు కోసం ఆటోడ్రైవర్గా మారాడు. కానీ అథ్లెటిక్స్పై ప్రేమను మాత్రం వదల్లేదు. తనయను అథ్లెటిక్స్లో ఛాంపియన్గా చూడాలనుకున్నాడు. ఆ దిశగా చిన్నతనం నుంచే ఆమెను ప్రోత్సహించాడు. ఇప్పుడా అమ్మాయి ఆసియా క్రీడల్లో రజతం గెలిచింది. ఆమెనే ఆన్సీ సోజన్. తండ్రి సోజన్ ఈటీ కలను నిజం చేస్తూ సాగుతోంది ఈ మలయాళీ చిన్నది. తండ్రి ప్రోత్సాహంతో ఏడో తరగతిలో ఉండగానే ఆన్సీ అథ్లెటిక్స్లో అడుగుపెట్టింది. మొదట్లో లాంగ్జంప్తో పాటు 100మీ. 200మీ, రిలే.. ఇలా స్ప్రింట్ విభాగాల్లోనూ పోటీపడేది. ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో ఆమె 100మీ. 200మీ.పరుగు, లాంగ్జంప్, 4×100మీ. రిలేలో స్వర్ణాలు గెలవడం విశేషం. కానీ గాయాలు ఆమెకు అడ్డుకట్ట వేశాయి. 2018లో కుడి చీలమండ గాయం, 2021లో మడమ గాయం, కండరాల గాయం ఆన్సీని వేధించాయి. దీంతో స్ప్రింట్కు వీడ్కోలు పలికి 2022 నుంచి కేవలం లాంగ్జంప్పైనే ఆమె దృష్టి సారించింది. పూర్తిగా దీనిపైనే ధ్యాస పెట్టి తీవ్రంగా సాధన చేస్తోంది. గతంలో స్ప్రింట్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆన్సీ తీవ్ర ఒత్తిడిలో ఉండేది. కానీ ఇప్పుడు లాంగ్జంప్ను ఆస్వాదిస్తూ, గాయాల బెడద కూడా లేకపోవడంతో పతకాల వేటలో దూసుకెళ్తోంది. లాంగ్జంప్లో జాతీయ అండర్-21 రికార్డు ఆన్సీదే. ఇండియన్ గ్రాండ్ ప్రి, జాతీయ పోటీల్లో స్వర్ణాలతో సత్తాచాటింది. నిరుడు కామన్వెల్త్ క్రీడల్లోనూ కేరళకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి పోటీపడింది. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్షిప్స్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు తొలిసారి ఆసియా క్రీడల బరిలో దిగి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి పతకాన్ని ముద్దాడింది. పసిడి నెగ్గిన అథ్లెట్ కంటే కేవలం 0.10 మీటర్ల వెనుకబడి ఆన్సీ రెండో స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీచర్ అవుదామనుకొని..
రెండు చేతులు లేకపోవడంతో జీవితంలో ఏం సాధించలేనని ఒకప్పుడు అనుకున్నానని పారా ఆర్చర్ శీతల్దేవి చెప్పింది. నంబర్వన్ అయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. ‘‘జీవితంలో ఏదీ సాధించలేనని అనుకునేదాన్ని. -
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
ఐపీఎల్ వేలం ప్రక్రియ మొదలైంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్ పిలుపునివ్వగా.. 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా.. -
IND vs AUS: కంగారూలను తిప్పేశారు
టీమ్ఇండియా అదరహో. నాలుగో టీ20లో కంగారూలను మట్టికరిపించిన ఆతిథ్య జట్టు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పొట్టి సిరీస్ను పట్టేసింది. గత మ్యాచ్లో కొండంత స్కోరు చేసినా పరాజయంపాలైన భారత్.. ఈసారి 174 పరుగులను కాపాడుకుంది. అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రింకు మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు. -
కూతకు వేళాయె.. నేటి నుంచే ప్రొ కబడ్డీ సీజన్-10
పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు... చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు.. ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్ మరొకరు! వీరంతా ఆడేది ఒకే వేదికలో! 12 జట్లు పోరాడేది ఒకే కప్ కోసం! -
రోహిత్ అప్పటిదాకా..
కనీసం 2024 టీ20 ప్రపంచకప్ వరకు రోహిత్ టీ20 కెప్టెన్గా ఉండాలని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్లో భారత జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్ రోహిత్తోపాటు కోహ్లి. -
పాక్ క్రికెట్ బోర్డులో ఆసక్తికర పరిణామం.. సెలెక్షన్ కమిటీలో బట్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్పాట్ ఫిక్సింగ్ నేరంపై శిక్ష అనుభవించిన మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ పీసీబీ సెలక్షన్ బోర్డులో సభ్యుడిగా ఎంపికయ్యాడు. -
గెలుపు బాటలో బంగ్లా
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/40) ఉచ్చులో చిక్కుకున్న కివీస్ ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. -
బ్రిస్బేన్ ఓపెన్తో రఫా పునరాగమనం
దాదాపు ఏడాది పాటు టెన్నిస్కు దూరంగా ఉన్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ పునరాగమనం చేయబోతున్నాడు. జనవరిలో బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో అతడు బరిలో దిగనున్నాడు. 37 ఏళ్ల రఫా.. -
ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుంది: ధుమాల్
ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ 50 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.4.14 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. -
మళ్లీ అలాగే కాళ్లు పెడతా: మార్ష్
ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకోవడాన్ని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సమర్థించుకున్నాడు. కప్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్న మార్ష్.. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు. -
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
ఆసీస్తో ఐదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. భారత్ 3-1 తేడాతో (IND vs AUS) కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో విజయం సాధించడంపై సూర్యకుమార్ స్పందించాడు. -
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
అక్షర్ పటేల్ (Axar Patel) .. ఆసీస్పై అద్భుత ప్రదర్శనతో నాలుగో టీ20 మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్ చేయడం వల్ల వికెట్లు దక్కాయని పేర్కొన్నాడు. -
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
దక్షిణాఫ్రికాతో (IND vs SA) వన్డే, టెస్టు, టీ20 సిరీస్లకు జట్లను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.