Gautam Gambhir: అదే అత్యంత చెత్త సెలెక్షన్ కమిటీ: గంభీర్
ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ప్యానెల్ అని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ విమర్శించాడు.
దిల్లీ: ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ప్యానెల్ అని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ విమర్శించాడు. 2019 వన్డే ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేసినప్పుడు సెలెక్షన్ కమిటీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నాలుగో స్థానానికి అనుభజ్ఞుడైన అంబటి రాయుడు బదులు విజయ్ శంకర్ను ఎంపిక చేయడం దుమారం రేపింది. ‘‘భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సెలెక్షన్ కమిటీ అది. అంబటి రాయుడు వంటి బ్యాటర్ను జట్టు నుంచి తప్పించారు. అతడిని ప్రపంచకప్కు తీసుకెళ్లకుండా మరొకరికి అవకాశం ఇచ్చారు. నాలుగో స్థానమే అతిపెద్ద సమస్యగా ఉన్నప్పటికీ ఇలా చేశారు. అంబటి రాయుడును ఏడాదంతా ఆడించారు. కాని ప్రపంచకప్కు ముందు తప్పించారు. అందుకు కారణమేంటో ఎవరికీ తెలియదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
ఫేవరెట్ భారత్: టేలర్
దిల్లీ: అన్ని అస్త్రాలతో చెలరేగుతున్న భారత్ స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్లో భిన్నంగా కనిపిస్తోందని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ అన్నాడు. ‘‘సొంతగడ్డపై భారత్ భిన్నమైన జట్టు. ప్రపంచకప్ను భారత్ గొప్పగా ప్రారంభించింది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సమయంలో ప్రపంచకప్ నెగ్గడానికి భారత్ను ఫేవరెట్గా చూస్తున్నా. బౌలింగ్ విభాగానికి బుమ్రా అద్భుతంగా నాయకత్వం వహించాడు. కుల్దీప్, రవీంద్ర జడేజా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. చాలాకాలంగా మొదటి ముగ్గురు బ్యాటర్లు గొప్పగా ఆడుతున్నారు. అన్ని సమయాల్లో టాప్-3 నుంచి పరుగులు ఆశించలేం. కాని శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రూపంలో నాలుగు, అయిదు స్థానాల్లో మంచి కూర్పు దొరికింది’’ అని టేలర్ తెలిపాడు.
ఆ సమయం వచ్చింది: క్లాసెన్
ముంబయి: తీవ్ర ఒత్తిడిలోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎంత బాగా ఆడగలరో ప్రపంచానికి చెప్పాల్సిన సమయం వచ్చిందని సఫారీ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అన్నాడు. ప్రపంచకప్లో తడబడే అలవాటున్న దక్షిణాఫ్రికా ఈసారి భారీ స్కోర్లతో చెలరేగుతోంది. ‘‘ప్రపంచకప్లో మా ప్రదర్శనలతో ప్రతి ఒక్కరిలో దక్షిణాఫ్రికాపై అలాంటి అభిప్రాయం వచ్చింది. కానీ మేం మంచి క్రికెట్ ఆడాం. కొన్నిసార్లు దురదృష్టం వెంటాడింది. ఇంకొన్నిసార్లు ప్రణాళికల్ని సరిగా అమలు చేయలేకపోయాం. అయితే ప్రపంచకప్ చరిత్ర పరిశీలిస్తే కొన్ని అత్యుత్తమ మ్యాచ్లు ఆడాం. మేం గొప్పగా ఆడటం ఆశ్చర్యకరమేమీ కాదు. గత మూడేళ్లుగా ఈ జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఆటగాళ్లు పరిణతి సాధిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అద్వితీయంగా ఆడగలరని ప్రపంచానికి చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని క్లాసెన్ తెలిపాడు.
నేను ఓపెనర్ను: జాన్సన్
ముంబయి: క్రికెటర్గా ఎదిగే క్రమంలో బ్యాటింగ్లో ఓపెనింగ్ చేసేవాడినని దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సన్ అన్నాడు. ఇంగ్లాండ్పై 42 బంతుల్లోనే 75 పరుగులు చేసిన నేపథ్యంలో జాన్సన్ ఇలా పేర్కొన్నాడు. బ్యాట్తో వీలైనంత ఎక్కువగా ఉపయోగపడాలని అనుకుంటున్నానని అతడు చెప్పాడు. ‘‘క్రికెటర్గా ఆరంభ దశలో ఓపెనర్గా ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్ను బాగా ఆస్వాదించేవాడిని. ఇప్పుడు ఈ విభాగంపై మరింత ఏకాగ్రత చూపించాలనుకుంటున్నా. అంతేకాదు బ్యాటర్గా జట్టుకు వీలైనంత ఎక్కువ ఉపయోగపడాలనేది నా కోరిక’’ అని జాన్సన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్ ఆడుతున్న క్రికెటర్లలోకెల్లా పొడగరి అయిన జాన్సన్.. ఇంగ్లాండ్పై మెరుపు ఇన్నింగ్స్ ఆడడమే కాక.. క్లాసెన్తో కలిసి సఫారీ జట్టుకు భారీ స్కోరు అందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!