ఇంతకన్నా బాగా ఆడలేను: పుజారా
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నిదానంగా ఆడిన టీమిండియా నయావాల్ చెతేశ్వర్ పుజారాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఫెన్స్కు ప్రాధాన్యత ఇస్తూ...
విమర్శలపై స్పందించిన నయావాల్
ఇంటర్నెట్డెస్క్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నిదానంగా ఆడిన టీమిండియా నయావాల్ చెతేశ్వర్ పుజారాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఫెన్స్కు ప్రాధాన్యత ఇస్తూ నయావాల్ 176 బంతుల్లో 50 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అయితే అతడు అతి జాగ్రత్తగా ఆడటం వల్ల ఇతర బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెరిగిందని, పుజారా వేగంగా ఆడాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీడియా సమావేశంలో పుజారా మాట్లాడాడు. ఆస్ట్రేలియా పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఆ పరిస్థితుల్లో అంతకంటే గొప్పగా ఆడలేనని విమర్శలపై స్పందించాడు.
‘‘నేను బాగానే ఆడాను. కానీ, మంచి బంతికి ఔటయ్యా. దాన్ని అంగీకరించాల్సిందే. ఇంతకన్నా గొప్పగా నేను ప్రయత్నించలేను. కమిన్స్ ఆడలేని బంతులు విసురుతున్నాడు. అది ‘బాల్ ఆఫ్ ది సిరీస్’గా నిలుస్తుంది (అతడు ఔటైన బంతి గురించి). బ్యాక్ లెంగ్త్తో వేసిన ఆ బంతిని వదిలేయాలనుకున్నా. కానీ అది ఎక్స్ట్రా బౌన్స్ అయింది. మీ రోజు కానప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి’’ అని అన్నాడు.
మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పుజారా వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ గాయం బ్యాటింగ్పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు పుజారా బదులిచ్చాడు. ‘‘గాయం ప్రభావమేమీ లేదు. అయితే నేను 100 శాతం ఫిట్నెస్తో లేను. తక్కువ నొప్పిని భరించగలను. ఇది ఎంతో కీలక మ్యాచ్ కాబట్టి దూరంగా ఉండలేను’’ అని పేర్కొన్నాడు. అయితే మూడో రోజు ఆటలో 330-340 పరుగులు సాధించడానికి గొప్పగా ప్రయత్నించామని, కానీ రిషభ్ పంత్ ఔటవ్వడం టర్నింగ్ పాయింట్గా మారిందని నయావాల్ తెలిపాడు. పంత్ ఔటైన తర్వాత ఆసీస్ పైచేయి సాధించిందని వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
అయితే గాయంతో జడేజా రెండో ఇన్నింగ్స్కు దూరమవ్వడం జట్టుకు ప్రతికూలాంశమని పుజారా తెలిపాడు. జడ్డూ గైర్హాజరీతో మిగిలిన బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుందని అన్నాడు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు సాధించిన జడ్డూ రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేవాడని పేర్కొన్నాడు. ఆల్రౌండర్గానే కాకుండా గొప్ప ఫీల్డర్గా జడేజా జట్టుకు విలువైన ఆటగాడని కొనియాడాడు. అతడి గైర్హాజరీ జట్టుకు లోటైనా గొప్పగా పుంజుకుని ఆస్ట్రేలియాపై పైచేయి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎడమచేతి బొటనవేలుకి గాయమవ్వడంతో జడ్డూ మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా, సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 197 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.