మొన్నటి హీరోలే.. ఇప్పుటి మా శత్రువులు: బ్రాడ్‌

గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించిందని ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ కొనియాడాడు. గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో...

Published : 01 Feb 2021 01:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించిందని ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ కొనియాడాడు. గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో ఆసీస్‌పై భారత్ గెలవాలని తమ జట్టు కోరుకుందని తెలిపాడు. అయితే ఇప్పుడు భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో.. రెండు వారాల క్రితం ప్రశంసించిన టీమిండియానే, ఇప్పుడు శత్రువుగా భావించాల్సి వస్తుందని అన్నాడు. అయితే టీమిండియాను అలా ఊహించుకోలేమని పేర్కొన్నాడు.

‘‘భారత్ పర్యటన అంత తేలిక కాదు. గబ్బాలో ఆస్ట్రేలియాపై విజయంతో టీమిండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే గబ్బా టెస్టులో భారత్‌కే మా జట్టు మద్దతు ఇచ్చింది. సమష్టి పోరాటం, సంకల్పం, గెలవాలనే స్ఫూర్తితో అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేసిన పోరాటాన్ని చూసి.. ప్రపంచంలో ఉన్న ఏ జట్టు అయినా ఎంతో గర్వపడుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కోహ్లీసేన ఉండటానికి కారణమిదే. అయితే రెండు వారాల క్రితం వాళ్ల ప్రదర్శనను అభిమానించిన మేం.. ఇప్పుడు టీమిండియాను శత్రువులుగా భావించాల్సి వస్తుంది. అయితే అలా ఊహించలేం’’ అని బ్రాడ్ వెల్లడించాడు.

‘‘నేను చూసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అయితే వాళ్ల సానుకూలతల గురించి ఆలోచిస్తే.. పోరాడక ముందే మేం ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. మా బలాలతో మేం బరిలోకి దిగుతాం. మా వద్ద టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే భారత్‌ పటిష్ఠంగా ఉంది. చారిత్రక విజయాలు సాధించింది. కానీ మేం సానుకూల ధోరణితో పోరాడితే తప్పక గెలుస్తాం’’ అని బ్రాడ్ అన్నాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు చెన్నైలో బయోబబుల్‌లో ఉన్నారు. చెపాక్‌ స్టేడియంలో ఫిబ్రవరి 5న తొలి టెస్టు జరగనుంది.

ఇవీ చదవండి

బుమ్రా ఫాస్ట్‌ బౌలర్‌ కాదు.. లెగ్ స్పిన్నర్‌!

అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని