IND vs PAK: పాక్తో మ్యాచ్లో సూర్యకుమార్ ఆడతాడా..? తుది జట్టు కూర్పే ఆసక్తికరం!
క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థుల (IND vs PAK) పోరు నేడే.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఇవాళ క్రికెట్ పండగ. అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాకిస్థాన్(IND vs PAK) మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, తుది జట్టు ఎంపికపై అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరిని తీసుకుంటారు..? ఎవరిని పక్కన పెడతారు? అనేది ఆసక్తికరంగా మారింది. పాక్ పేస్ను తట్టుకోవాలంటే బ్యాటింగ్ బలంగా ఉండాలి. అదే సమయంలో పదునైన బౌలింగ్తో బరిలోకి దిగాలి. తుది జట్టులోని దాదాపు అన్ని స్థానాలు ఓకే అయినప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ఒకటీ రెండు మార్పులు ఉంటాయని చెప్పిన విషయం గుర్తుంది కదా. మరి ఆ మార్పులు ఎక్కడ ఉండొచ్చనేదే కీలకంగా మారింది.
ఓపెనింగ్లో వీరు..
తొలి రెండు మ్యాచ్లకు దూరమైన శుభ్మన్ గిల్ ఇప్పుడు పాక్తో ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డెంగీ నుంచి కోలుకుని ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే, గిల్ను ఆడించకూడదని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం ఇషాన్ కిషన్కు మరో అవకాశం వచ్చినట్లే. కానీ, గత రెండు మ్యాచుల్లో ఇషాన్ సాధికారిక ఇన్నింగ్స్లు ఆడలేకపోయాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ను ఓపెనర్గా తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవర్ ప్లేలో భారీ షాట్లు కొట్టడం, పేస్ను అద్భుతంగా ఆడగలిగే సూర్య సెట్ అవుతాడనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. అయితే, కీలక పోరులో భారత్ ప్రయోగాలకు వెళ్తుందా..? అనేది కూడా సందేహమే.
వీరంతా ఫిక్స్..
భారత టాప్ ఆర్డర్లో ఓపెనర్లు కాకుండా వన్డౌన్, సెకండ్ డౌన్ చాలా కీలకం. అయితే, ఈ రెండు స్థానాల్లో టీమ్ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చేయడం టీమ్ఇండియాకు కలిసొచ్చేదే. ఇక మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ జట్టుకు అండగా నిలిచారు. లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/రవిచంద్రన్ అశ్విన్ కూడా విలువైన పరుగులు చేయగల సత్తా ఉన్న బ్యాటర్లు. అయితే శార్దూల్ లేదా అశ్విన్లో ఒకరికే అవకాశం ఉండొచ్చు. పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉందని భావిస్తే అశ్విన్ వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపనుంది.
బౌలింగ్ దళం ఇదే..
భారత స్క్వాడ్లో జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, షమీ ప్రధాన పేసర్లు కాగా.. హార్దిక్పాండ్య, శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్రౌండర్లు. ఇక అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు తీసుకున్నారు. హార్దిక్, శార్దూల్ తుది జట్టులో ఉంటే మరో ఇద్దరు పేసర్లను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పాక్పై అద్భుతంగా బౌలింగ్ చేసే షమీని తీసుకోవడం ఉత్తమమనే వాదనా ఉంది. అప్పుడు బుమ్రా, షమీ, హార్దిక్, శార్దూల్తోపాటు జడేజా, కుల్దీప్తో కూడిన బౌలింగ్ దళం బరిలోకి దిగనుంది. పాక్ బ్యాటర్లు బాబర్, రిజ్వాన్, షకీల్, అబ్దుల్లా, ఇఫ్తికార్ను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాలి.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ (కెప్టెన్), శుభ్మన్/ఇషాన్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, అశ్విన్/శార్దూల్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్/షమీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా