IND vs ENG: ఇంగ్లాండ్తో ఐదో టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ లీడ్ 255
ఐదో టెస్టులోనూ టీమ్ఇండియా భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ బౌలింగ్ను అద్భుతంగా ఎదుర్కొని పట్టు బిగించే దిశగా భారత్ సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ బౌలర్లపై టాప్ -5 బ్యాటర్ల ఆధిపత్యం.. భారత టెయిలెండర్లు క్రీజ్లో పాతుకుపోయిన విధానం అద్భుతం. మరీ ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పక్కా బ్యాటర్గా ఆడటం విశేషం. దీంతో ఐదో టెస్టులో టీమ్ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. ఆరంభంలో ఇద్దరు సెంచరీలు.. ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడంతో బలమైన పునాది పడింది.. ఇవీ ఇంగ్లాండ్తో ఐదో టెస్టు రెండో రోజు ఆట విశేషాలు..
ఇంగ్లాండ్తో ఐదో టెస్టు రెండో రోజు ఆటలోనూ (IND vs ENG) భారత్దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా భారీ లీడ్లోకి దూసుకెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. క్రీజ్లో కుల్దీప్ యాదవ్ (27*), జస్ప్రీత్ బుమ్రా (19*) ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110) సెంచరీలతో కదం తొక్కారు. యశస్వి జైస్వాల్ (57), దేవదుత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. పరుగులను నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆధిక్యం 255 పరుగులు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 218 రన్స్కే కుప్పకూలింది.
ఐదుగురు అదుర్స్..
ఓవర్నైట్ 135/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు శుభారంభమే దక్కింది. రెండో వికెట్కు రోహిత్, గిల్ ఏకంగా 171 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేశారు. చాలా రోజుల తర్వాత బౌలింగ్కు వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంధించిన తొలి బంతికే రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే, స్వల్ప వ్యవధిలో రోహిత్-గిల్ ఔట్ కావడంతో టీమ్ఇండియా ఇబ్బందుల్లో పడినట్లు అనిపించినా కోలుకోగలిగింది. అరంగేట్ర బ్యాటర్ దేవదుత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకాలతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. దీంతో తొలి ఐదుగురు బ్యాటర్లు 50+ స్కోర్లు చేయడం విశేషం. మరోసారి ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించి పడిక్కల్, ధ్రువ్ జురెల్ (15), రవీంద్ర జడేజా (15), రవిచంద్రన్ అశ్విన్ (0)ను ఔట్ చేశారు. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కావడం గమనార్హం. అయితే, కుల్దీప్ యాదవ్ - జస్ప్రీత్ బుమ్రా క్రీజ్లో పాతుకుపోయారు. ఇప్పటికే తొమ్మిదో వికెట్కు 108 బంతుల్లో 45 పరుగులు జోడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.