IPL 2023- Playoffs: ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్కు ఎలా చేరాయంటే?
ఐపీఎల్-16లో రేపటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ (Playoffs) చేరిన నాలుగు జట్లు ఏ జట్టుపై విజయం సాధించాయి, ఏ టీమ్పై ఓడిపోయాయో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్లో లీగ్ దశ ముగిసింది. ఈ సారి ఎన్నాడూ లేనంతగా హోరాహోరీ మ్యాచ్లు జరిగాయి. చాలా మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లో చివరి బంతి వరకు ఫలితం తేలలేదు. అంతేకాదు లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వరకు చివరి ప్లేఆఫ్స్ బెర్తు తేలలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) విజయం సాధించడంతో ఆఖరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్కు చేరుకున్న జట్లు ఏ టీమ్పై గెలిచాయి, ఏ టీమ్తో ఓటమిపాలయ్యాయి అనే దానిపై ఓ లుక్కేద్దాం.
గుజరాత్ టైటాన్స్ (GT)
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి పాయింట్ల పట్టికలో 10 విజయాలు, 4 ఓటములతో అగ్రస్థానంలో నిలిచి అన్ని జట్ల కంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకుంది.
విజయాలు: చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ (రెండుసార్లు), ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఓటములు: కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
గతేడాది పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో చెలరేగుతోంది. 14 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో కలిపి 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
విజయాలు: లఖ్నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ (రెండు సార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ (రెండు సార్లు). లఖ్నవూతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్.
ఓటములు: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్.
లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG)
లఖ్నవూ సూపర్ జెయింట్స్ కూడా వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో కలిపి 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీఎస్కేకు కూడా 17 పాయింట్లే ఉన్నప్పటికీ మెరుగైన రన్రేట్ ఉండటంతో ఆ జట్టు రెండో స్థానంలో నిలిచింది.
విజయాలు: దిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (రెండు సార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్. చెన్నైతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్.
ఓటములు: చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (రెండుసార్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ముంబయి ఇండియన్స్ (MI)
ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు (5) విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో చివరి ప్లేఆఫ్స్ బెర్తుని దక్కించుకుంది. ఆఖరి మ్యాచ్లో సన్రైజర్స్పై నెగ్గడంతోపాటు గుజరాత్పై ఆర్సీబీ ఓడిపోవడంతో ముంబయి ముందంజ వేసింది. ఆ జట్టు ఖాతాలో 8 విజయాలు, 6 ఓటములున్నాయి.
విజయాలు: దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (రెండుసార్లు), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్.
ఓటములు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ (రెండు సార్లు), పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్