Sachin - Kuldeep: స్పెషల్ డే... సచిన్ ‘హిందీ’ ప్రశ్నలు... కుల్దీప్ ‘బెస్ట్’ అంటూ మాజీ క్రికెటర్ ప్రశంసలు
టీమ్ఇండియా లెగ్స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రెటీస్లో సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ఒకరు. ఆయన ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ క్రీడలతోపాటు వివిధ అంశాలపై పోస్టులు పెడుతుంటారు. నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవాన్ని (Hindi Diwas)ను పురస్కరించుకుని ఎక్స్(ట్విటర్)లో సరదాగా అభిమానులకు నాలుగు ప్రశ్నలు సంధించారు. అంపైర్, వికెట్ కీపర్, ఫీల్డర్, హెల్మెట్ను హిందీలో ఏమని పిలుస్తారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కొంతమంది నెటిజన్లు కింది విధంగా సమాధానమిచ్చారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ కుల్దీప్
టీమ్ఇండియా లెగ్స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని కొనియడాడు. ఆసియాకప్ (Asia Cup 2023)లో కుల్దీప్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఐదు వికెట్లు పడగొట్టిన అతడు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
‘‘ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని భావిస్తున్నా. అతడి గణాంకాలు చాలా బాగున్నాయి. నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. ఇటీవల వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇన్ని వికెట్లు పడగొట్టడం సాధారణ విషయం కాదు. 85 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఎడమ చేతి వాటంతో మణికట్టును ఉపయోగించి బంతిని స్పిన్ చేయడం అతడి ప్రత్యేకత (‘చైనామన్’ బౌలింగ్ శైలి). అజంతా మెండిస్, రషీద్ఖాన్ గురించి మాట్లాడుకుంటే వారు మిస్టరీ స్పిన్నర్లు. కానీ, కుల్దీప్ యాదవ్ అలా కాదు. అతడు సాధారణ లెగ్ స్పిన్, గూగ్లీ బౌలింగ్ చేస్తాడు. దానితోనే బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.