Mumbai Indians: అందుకే రోహిత్ స్థానంలో హార్దిక్.. అసలు కారణం చెప్పిన ముంబయి ఇండియన్స్ కోచ్
Mumbai Indians: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను నియమించడంపై ఆ జట్టు కోచ్ అసలు కారణాన్ని బయటపెట్టారు. దీన్ని భావోద్వేగాలతో ముడిపెట్టొద్దని కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్సీ మార్పు నిర్ణయం క్రికెట్లో పెను తుపాను సృష్టించిన విషయం తెలిసిందే. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మకు (Rohit Sharma) బదులు హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను సారథిగా నియమించడం అభిమానులను షాక్కు గురిచేసింది. దీంతో ఆ ఫ్రాంఛైజీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై జట్టు కోచ్ మార్క్ బోచర్ స్పందిస్తూ మార్పు వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు.
ఓ క్రీడాఛానల్ పాడ్కాస్ట్లో కోచ్ మార్క్ దీనిపై మాట్లాడారు. ‘‘ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమే. నా వరకు ఇదో పరివర్తన దశ మాత్రమే. చాలా మందికి ఈ విషయం అర్థంగాక, భావోద్వేగానికి గురయ్యారు. కానీ, ఆటకు సంబంధించిన విషయాల్లో ఉద్వేగాలను పక్కనబెట్టాలి. ఓ ఆటగాడిగా రోహిత్ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలుచేస్తుంది. అతడు మరింత స్వేచ్ఛతో ఆడి మంచి పరుగులు సాధించనివ్వండి’’ అని తెలిపారు.
భారత్ను వీడనున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు కారణం ఇదే..
ఇక, ఐపీఎల్లో క్రికెటేతర బాధ్యతలు కూడా కెప్టెన్సీ మార్పునకు మరో కారణమని మార్క్ వెల్లడించారు. ‘‘గత రెండు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ బ్యాట్తో రాణించలేకపోయాడు. అందుకే అతడి భుజాలపై బాధ్యతలను తగ్గించాలనుకున్నాం. లీగ్ టోర్నీలో కెప్టెన్కు ఆట కాకుండా చాలా బాధ్యతలుంటాయి. ఫొటోషూట్స్, ప్రకటనల వంటివి కూడా చూసుకోవాలి’’ అని మార్క్ వెల్లడించారు.
కాగా.. ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూపై రోహిత్ శర్మ సతీమణి రితికా విమర్శనాత్మక పోస్ట్ చేశారు. ‘‘దీని వల్ల చాలా తప్పిదాలు జరిగాయి’’ అంటూ ఆమె పేర్కొనడం చర్చకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!