Nepal Cricket: కార్డియాక్ కిడ్స్... వీళ్ల స్ట్రోక్లు మామూలుగా ఉండవ్!
క్రికెట్లో నేపాల్ (Nepal Cricket Team) అనగానే పసికూన అనే అంతా అనుకుంటారు. కానీ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు బాదింది అంటే నమ్ముతారా? అంతేకాదు ఆ మ్యాచ్లో ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయంటే నమ్ముతారా? కానీ ఆ జట్టు చేసింది, చేసి చూపించింది.
క్రికెట్లో నేపాల్ (Nepal Cricket Team) అనగానే పసికూన అనే అంతా అనుకుంటారు. కానీ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు బాదింది అంటే నమ్ముతారా? అంతేకాదు ఆ మ్యాచ్లో ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయంటే నమ్ముతారా? కానీ ఆ జట్టు చేసింది, చేసి చూపించింది. ఆసియా గేమ్స్లో భాగంగా మంగోలియా మీద ఈ ఘనత సాధించారు. అంతకుమందు ఆసియా కప్లో టీమ్ ఇండియాకు చెమటలు పట్టించారు. కార్డియాక్ కిడ్స్ అని తమ జట్టుకు ఎందుకు పేరు వచ్చిందో మరోసారి అర్థమయ్యేలా చేశారు.
ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాట్స్మెన్ దీపేంద్రసింగ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం తొమ్మిది బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. దీంతో టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 50) రికార్డు బద్దలైంది. ఆసియా గేమ్స్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్లో దీపేంద్ర సింగ్ ఈ ఘనతను సాధించాడు. ఇదే మ్యాచ్లో 314/3తో టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేశారు. నేపాల్ బ్యాటర్ కుషాల్ మల్ల 34 బంతుల్లో వంద పరుగులు రికార్డూ సృష్టించాడు. ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్లో వన్డే ఫార్మాట్లో నేపాల్ ఏకంగా 230 పరుగులు చేసింది. భారత బౌలర్లను ఆ జట్టు బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. ఆ జట్టు ఆటగాళ్లలో భయమన్నదే కనిపించలేదు. ఈ మ్యాచ్లో నేపాల్ చివరికి చిత్తుగానే ఓడినా.. వారి ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది.
టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్.. ఆసియా క్రీడల్లో రికార్డుల మోత
ప్రపంచ క్రికెట్లో ప్రతి జట్టుకూ ఒక నిక్ నేమ్ ఉంటుంది. భారత జట్టును ‘మెన్ ఇన్ బ్లూ’ అన్నట్లుగా.. నేపాల్ జట్టుకు కూడా ఒక పేరుంది. అదే.. కార్డియాక్ కిడ్స్. ఇదేం పేరు అని ఆశ్చర్యం కలగడం ఖాయం. కార్డియాక్ అంటే గుండె సంబంధిత పదం అన్న సంగతి తెలిసిందే. మరి క్రికెట్ జట్టు పేరులో ఈ పదం ఎందుకు ఉంది అంటే? తమతో తలపడే ప్రత్యర్థులకు గుండెపోటు తెప్పిస్తారనే ఉద్దేశంతోనే ఆ జట్టుకు ఆ పేరు పెట్టారు. అసోసియేట్ దేశాలతో జరిగిన అనేక టోర్నీలు, మ్యాచ్ల్లో నేపాల్ అలాంటి సంచలన ప్రదర్శనే చేసింది. తనకంటే మెరుగైన జట్లకు ఎన్నోసార్లు షాకులిచ్చింది. అందుకే ఆ జట్టు ఆటగాళ్లకు ‘కార్డియాక్ కిడ్స్’ అనే పేరు పెట్టారు.
2014లో టీ20 హోదాను సంపాదించిన నేపాల్.. కొన్ని నెలలకే అఫ్గానిస్థాన్ మీద సంచలన విజయంతో తన పేరు మార్మోగేలా చేసింది. అప్పటికే అఫ్గాన్ చిన్న జట్లలో పెద్ద టీంగా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేస్తోంది. అలాంటి జట్టు మీద టీ20ల్లో గెలవడంతో నేపాల్ వైపు అందరూ చూశారు. ఇక స్కాట్లాండ్, నెదర్లాండ్స్, కెన్యా లాంటి పేరున్న అసోసియేట్ దేశాలపై నేపాల్ కొన్ని అద్భుత విజయాలు సాధించింది. ఒమన్, యూఏఈ, పపువా న్యూ గినియా లాంటి అసోసియేట్ జట్ల మీద నేపాల్కు మంచి రికార్డుంది. ఇప్పుడు మంగోలియా మీద కూడా తన ప్రతాపం చూపించింది. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలో పెద్ద జట్లకు కూడా హడలు పుట్టించే అవకాశం ఉంది.
ఐపీఎల్లో నేపాలీ
నేపాల్ క్రికెట్కు మంచి గుర్తింపు రావడంలో సందీప్ లమిచానెది ముఖ్య పాత్ర. ఈ స్పిన్ ఆల్రౌండర్ టీనేజీలోనే గొప్ప ప్రదర్శన చేశాడు. మిస్టరీ స్పిన్నర్గా పేరు తెచ్చుకున్నాడు. నేపాల్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్ల్లో కూడా అతను సత్తా చాటాడు. చిన్న వయసులోనే అతను నేపాల్ జట్టుకు కెప్టెన్సీ కూడా చేయడం విశేషం. అతను ఇప్పటికే ఐపీఎల్లో కూడా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సందీప్ను 2018 సీజన్లో తమ జట్టులోకి తీసుకుంది. వరుసగా రెండు సీజన్లలో ఆడించింది. 9 మ్యాచ్లు ఆడిన సందీప్ 22.6 సగటుతో 13 వికెట్లు తీశాడు. ఒక నేపాల్ క్రికెటర్ ఐపీఎల్లో ఆడటం అంటే క్రికెట్ పరంగా ఆ దేశానికే అది పెద్ద అచీవ్మెంట్. అతను మంచి గణాంకాలే నమోదు చేసినా.. తర్వాత అవకాశాలు రాలేదు. నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్, దీపేంద్ర సింగ్ ఐరీ సహా కొందరు క్రికెటర్లకు భారత మూలాలున్నాయి. గతంలో శక్తి గౌచన్ అనే క్రికెటర్ ముందుగా ముంబయికి ప్రాతినిధ్యం వహించి.. ఆ తర్వాత నేపాల్ జాతీయ జట్టులో చోటు సంపాదించి అంతర్జాతీయ క్రికెట్ ఆడటం విశేషం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.