Gautam Gambhir: మీ షార్ప్ మెమొరీ సీక్రెట్ ఏంటి?గంభీర్కు అభిమాని ఆసక్తికర ప్రశ్న
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)కు ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న అడిగాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. ఓ వైపు ఎంపీగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే పలు వర్తమాన అంశాలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటాడు. విమర్శలపాలవుతానని తెలిసినా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెబుతాడు. గంభీర్ క్రికెట్కు వీడ్కోలు పలికినా ఇప్పటికీ ఫిట్గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సామాజిక మాధ్యమం ఎక్స్ (x)లో #askgg పేరుతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని గంభీర్ని ‘‘మీ మెమొరీ షార్ప్గా ఉండటం వెనుక సీక్రెట్ ఏంటి..?’’ అని ప్రశ్నించాడు. దానికి గంభీర్ ‘‘ఆరోగ్యకరమైన బోరింగ్ డైట్. నో ఆల్కహల్, నో స్మోకింగ్’’ అని సమాధానమిచ్చాడు. ‘‘మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరు’’ అని మరో అభిమాని అడగ్గా.. ‘‘ఒకే ఒక్కడు అది ముత్తయ్య మురళీధరన్’’ అని గంభీర్ జవాబిచ్చాడు.
ఆస్ట్రేలియా 2023 అత్యుత్తమ టెస్టు జట్టు.. భారత్ నుంచి ఇద్దరికి ఛాన్స్
2023లో టెస్టు క్రికెట్లో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తమ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు లభించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఉన్నారు. పాట్ కమిన్స్ని కెప్టెన్గా ఎంపిక చేసింది. అత్యధికంగా ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఈ జట్టులోకి తీసుకున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా బెస్ట్ ఎలెవన్ 2023:
- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా.. 24 ఇన్నింగ్స్లు 1210 పరుగులు)
- దిముత్ కరుణరత్నె (శ్రీలంక.. 10 ఇన్నింగ్స్లు 608 పరుగులు)
- కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్.. 13 ఇన్నింగ్స్లు 696 పరుగులు)
- జో రూట్ (ఇంగ్లాండ్.. 14 ఇన్నింగ్స్లు 787 పరుగులు)
- హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్.. 14 ఇన్నింగ్స్లు 701 పరుగులు)
- లోర్కాన్ టకర్ (ఐర్లాండ్.. 8 ఇన్నింగ్స్లు 351 పరుగులు)
- రవీంద్ర జడేజా (భారత్.. 9 ఇన్నింగ్స్లు 281 పరుగులు, 33 వికెట్లు)
- రవిచంద్రన్ అశ్విన్ (భారత్.. 7 మ్యాచ్లు 41 వికెట్లు)
- పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా.. 11 మ్యాచ్లు 42 వికెట్లు)
- కగిసో రబాడ (దక్షిణాఫ్రికా.. 4 మ్యాచ్లు 20 వికెట్లు)
- స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్.. 8 మ్యాచ్లు.. 38 వికెట్లు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!