Pakistan vs Nepal: ప్రపంచ రికార్డు నెలకొల్పిన బాబర్ అజామ్.. ఆషీమ్ ఆమ్లా, కోహ్లీ రికార్డు బద్ధలు..
నేపాల్తో జరిగిన ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023లో పాకిస్థాన్కు అదిరే ఆరంభం లభించింది. నేపాల్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో పాక్ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) (151; 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లు) భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ (109; 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 ఫోర్లు) మెరుపు శతకం బాదాడు. తొలిసారి ఆసియా కప్ ఆడుతున్న నేపాల్ ఈ భారీ లక్ష్యఛేదనలో 104 పరుగులకే కుప్పకూలింది. ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామి (28), గుల్సన్ ఝా (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. షాదాబ్ ఖాన్ (4/27), షాహీన్ అఫ్రిది (2/27), హారిస్ రవూఫ్ (2/16) నేపాల్ బ్యాటర్లను బెంబేలెత్తించారు.
‘పాకిస్థాన్తో మ్యాచ్ అనగానే కోహ్లీ చెలరేగి ఆడతాడు’
మరోవైపు ఈ మ్యాచ్లో భారీ శతకం బాదడంతో బాబర్ అజామ్.. వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ పాక్ బ్యాటర్కు ఇది 19వ సెంచరీ. 102 ఇన్నింగ్స్ల్లోనే అతడు ఈ ఘనత అందుకుని వన్డేల్లో వేగంగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్లు), విరాట్ కోహ్లీ (124 ఇన్నింగ్స్లు)ల పేరిట ఉండేది. ఇక ఆసియా కప్లో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా బాబర్ అజామ్ రికార్డు నెలకొల్పాడు.
ఇంగ్లాండ్లోనూ పురుషులతో సమంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు
పురుష క్రికెటర్లతో సమంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులను చెల్లించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లాండ్ చేరింది. ఇటీవల ముగిసిన మహిళల మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. రికార్డు స్థాయిలో జనాలు స్టేడియాలకు పోటెత్తారు. దీంతో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు పెంచుతామని ఈసీబీ (ECB) ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.