WTC Final: తొలుత రహానె.. మరోసారి శార్దూల్.. సేమ్ బౌలర్
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) భారత్ ఇన్నింగ్స్ను ఆదుకున్న అజింక్య రహానె, శార్దూల్ ఠాకూర్ను త్వరగా ఔట్ చేసే అవకాశాన్ని ఆసీస్ వదులుకుంది. రెండుసార్లూ ఒకే బౌలర్ కావడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ (WTC Final 2023) రెండు సంఘటనలు జరిగాయి. బాధితుడు మాత్రం ఒకే బౌలర్ కావడం గమనార్హం. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో భారత బ్యాటర్లు అజింక్య రహానె (89), శార్దూల్ (51) ఠాకూర్ ఎల్బీ రూపంలో పెవిలియన్కు చేరే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
వరుసగా వికెట్లను కోల్పోయిన భారత్ను రహానె - శార్దూల్ సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే, కమిన్స్ బౌలింగ్లో రహానె, శార్దూల్ ఇద్దరూ ఎల్బీగా పెవిలియన్కు చేరేవారు. కానీ, ఆ రెండు బంతులు కూడా ‘నో బాల్’ కావడంతో బతికిపోయారు. అదీనూ రహానె, శార్దూల్ డీఆర్ఎస్కు వెళ్లినప్పుడే ఫలితం అనుకూలంగా వచ్చింది. తొలుత రహానె ఇలా డీఆర్ఎస్తో జీవదానం పొందాడు. రెండో రోజు (గురువారం) భారత ఇన్నింగ్స్లోని 22వ ఓవర్ చివరి బంతికి ఎల్బీ కోసం కమిన్స్ అప్పీలు చేశాడు. అంపైర్ ఔట్గా ఇచ్చాడు. కానీ, డీఆర్ఎస్కు వెళ్లిన రహానెకు ‘నో బాల్’ కలిసొచ్చింది. అప్పుడు రహానె స్కోరు 17 పరుగులు మాత్రమే.
ఇవాళ కమిన్స్ బౌలింగ్లోనే (59.4వ ఓవర్) శార్దూల్ ఠాకూర్కూ ఇలానే జరిగింది. అప్పుడు నాన్స్ట్రైకింగ్లో రహానె ఉండటం విశేషం. అంపైర్ ఔట్గా ఇచ్చినా భారత్ డీఆర్ఎస్కు వెళ్లింది. సమీక్షలో ఔట్గా తేలినప్పటికీ ‘నో బాల్’కావడంతో నాటౌట్గా బయటపడ్డాడు. అప్పుడు శార్దూల్ స్కోరు 36 పరుగులు. ఆ తర్వాత హాఫ్ సెంచరీలు సాధించిన వీరిద్దరూ పెవిలియన్కు చేరడంతో భారత్ ఇన్నింగ్స్ కూడా త్వరగా ముగిసింది. చివరికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్కు 173 మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి