Best ODI Team Of 2023: జట్టులో వారెవరూ లేరు.. భారత అభిమానులే ఓటింగ్ చేసినట్లుంది: రవిశాస్త్రి
ఓ క్రీడా ఛానెల్ ప్రకటించిన ఉత్తమ వన్డే జట్టుపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి తన విశ్లేషణను కుండబద్దలు కొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును (Best odi Team 2023) ప్రముఖ క్రీడా ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. అందులో ఎనిమిదిమంది భారత ఆటగాళ్లకు చోటు దక్కడం గమనార్హం. క్రికెట్ అభిమానుల ఓటింగ్ను బట్టే ఈ ఎంపిక జరిగిందని ఆ ఛానెల్ పేర్కొంది. అయితే, జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కేవలం టీమ్ఇండియా క్రికెట్ అభిమానులే ఓటింగ్లో పాల్గొన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించాడు.
‘‘జట్టు ఎంపిక మరీ హాస్యాస్పదంగా ఉంది. మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, క్వింటన్ డికాక్ వంటి ఆటగాళ్లకు అవకాశమే లేదా? కేవలం భారత క్రికెట్ అభిమానులు మాత్రమే ఈ ఓటింగ్లో పాల్గొన్నారేమో అనిపిస్తోంది. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆసీస్ జట్టు నుంచి కేవలం ఒక్క ఆటగాడికే అవకాశం ఇచ్చారు. అదీనూ ఆడమ్ జంపాను ఎంపిక చేశారు. రషీద్ ఖాన్ అత్యుత్తమ ఆల్రౌండర్. అలాగే జడేజానూ ఎంపిక చేయలేదు. రషీద్-జడేజా కాంబినేషన్ ఏ ఫార్మాట్లోనైనా సూపర్ జోడీ. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ అత్యంత ప్రమాదకర బ్యాటర్. అతడికి అవకాశం ఇవ్వడం బాగుంది’’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఉత్తమ వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, డారిల్ మిచెల్, కేఎల్ రాహుల్, హెన్రిచ్ క్లాసెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, బుమ్రా ఉన్నారు.
గ్లెన్ మాక్స్వెల్కూ దక్కని అవకాశం: ఫిలాండర్
‘‘నేనే క్వింటన్ డికాక్ను అయి ఉంటే ఈ సెలక్షన్ను చూసి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యేవాడిని. ఈ ఏడాదే వన్డేలకు అతడు వీడ్కోలు పలికాడు. అతడు అద్భుతమైన ఆటగాడు. అయితే, భారత అభిమానులు ఎందుకు ఇలా సెలక్ట్ చేశారనేది నాకర్థమవుతోంది. ఈ ఏడాది టీమ్ఇండియా మంచి ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీ స్థిరత్వం తీసుకొచ్చాడు. ఈ జాబితాలో ఐదెన్ మార్క్రమ్ లేదా డేవిడ్ మిల్లర్ ఉండాల్సింది. ఇక ఒంటిచేత్తో అఫ్గాన్పై ఆసీస్ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ను ఎలా వదిలేశారు? ఆసీస్ వరల్డ్ కప్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర’’ అని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా