Ravi Shastri: దిల్లీ జట్టు ఆటగాళ్లకు ఆమాత్రం తెలియదా: రవిశాస్త్రి మండిపాటు
గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ విషయంలో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు...
ఇంటర్నెట్డెస్క్: గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ విషయంలో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేరాడు. ఒకడుగు ముందుకేసి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టిమ్డేవిడ్ లాంటి ప్రమాదకర బ్యాట్స్మన్ ఖాతా కూడా తెరవకముందే ఔటయ్యే అవకాశం వస్తే వినియోగించుకోరా? అప్పటికింకా చేతిలో ఐదు ఓవర్లే ఉండగా రెండు రివ్యూలున్నా.. వాటిని ఉపయోగించుకునే కనీస విషయం తెలియదా? అంటూ మండిపడ్డాడు.
‘దిల్లీ ఆటగాళ్లకు ఆ మాత్రం తెలియదా? డేవిడ్ బ్యాట్ అంచున తాకి వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడినప్పుడు పంత్, శార్ధూల్ను వదిలేస్తే.. ఇతర ఆటగాళ్లు ఏం చేస్తున్నారు. అప్పటికి గేమ్లో ఇంకా ఐదు ఓవర్లే మిగిలి ఉన్నాయి. దిల్లీ వద్ద రెండు రివ్యూలు మిగిలాయి. డేవిడ్ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు బంతికే ఒక వికెట్ దక్కింది. దీంతో అతడి వికెట్తో కూడా దక్కితే రెండోదయ్యేది. అప్పుడు దిల్లీ జట్టే పైచేయి సాధించేది. అలాంటి సమయంలో రివ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదా? దానికి ఏం ఇంగిత జ్ఞానం కావాలి? ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇది వాళ్లు చేజేతులా చేసుకున్నదే. ఈ తప్పిదం వల్ల ఆటగాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఇది ప్లేఆఫ్స్కు చేరవేసే కీలక మ్యాచ్. అలాంటి ముఖ్యమైన దాన్ని కోల్పోయారు. ఇక్కడ ఎవర్నీ నిందించాల్సిన అవసరం లేదు. వాళ్లని వాళ్లే నిందించుకోవాలి. ఈ మ్యాచ్లో ముంబయి గెలిచిందని చెప్పేకన్నా దిల్లీనే స్వయంగా ఓడిందని అనాలి’ అని రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాంటివి జరుగుతుంటాయి: రోహిత్
మరోవైపు ఇదే విషయంపై ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అప్పుడప్పుడు ఆటలో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పాడు. పంత్ మంచి కెప్టెన్ అని, అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు చేయిదాటిపోతాయని, అదంతా సహజమని కొట్టిపారేశాడు. తానూ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. అదే విషయాన్ని పంత్కు వివరించానన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
UP: వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది