Ravi Shastri: దిల్లీ జట్టు ఆటగాళ్లకు ఆమాత్రం తెలియదా: రవిశాస్త్రి మండిపాటు
గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ విషయంలో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు...
ఇంటర్నెట్డెస్క్: గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ విషయంలో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రివ్యూ తీసుకోకపోవడంపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేరాడు. ఒకడుగు ముందుకేసి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టిమ్డేవిడ్ లాంటి ప్రమాదకర బ్యాట్స్మన్ ఖాతా కూడా తెరవకముందే ఔటయ్యే అవకాశం వస్తే వినియోగించుకోరా? అప్పటికింకా చేతిలో ఐదు ఓవర్లే ఉండగా రెండు రివ్యూలున్నా.. వాటిని ఉపయోగించుకునే కనీస విషయం తెలియదా? అంటూ మండిపడ్డాడు.
‘దిల్లీ ఆటగాళ్లకు ఆ మాత్రం తెలియదా? డేవిడ్ బ్యాట్ అంచున తాకి వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడినప్పుడు పంత్, శార్ధూల్ను వదిలేస్తే.. ఇతర ఆటగాళ్లు ఏం చేస్తున్నారు. అప్పటికి గేమ్లో ఇంకా ఐదు ఓవర్లే మిగిలి ఉన్నాయి. దిల్లీ వద్ద రెండు రివ్యూలు మిగిలాయి. డేవిడ్ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు బంతికే ఒక వికెట్ దక్కింది. దీంతో అతడి వికెట్తో కూడా దక్కితే రెండోదయ్యేది. అప్పుడు దిల్లీ జట్టే పైచేయి సాధించేది. అలాంటి సమయంలో రివ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదా? దానికి ఏం ఇంగిత జ్ఞానం కావాలి? ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇది వాళ్లు చేజేతులా చేసుకున్నదే. ఈ తప్పిదం వల్ల ఆటగాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఇది ప్లేఆఫ్స్కు చేరవేసే కీలక మ్యాచ్. అలాంటి ముఖ్యమైన దాన్ని కోల్పోయారు. ఇక్కడ ఎవర్నీ నిందించాల్సిన అవసరం లేదు. వాళ్లని వాళ్లే నిందించుకోవాలి. ఈ మ్యాచ్లో ముంబయి గెలిచిందని చెప్పేకన్నా దిల్లీనే స్వయంగా ఓడిందని అనాలి’ అని రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాంటివి జరుగుతుంటాయి: రోహిత్
మరోవైపు ఇదే విషయంపై ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అప్పుడప్పుడు ఆటలో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పాడు. పంత్ మంచి కెప్టెన్ అని, అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు చేయిదాటిపోతాయని, అదంతా సహజమని కొట్టిపారేశాడు. తానూ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. అదే విషయాన్ని పంత్కు వివరించానన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’