Rohit Sharma: తన పేరు ప్రకటించగానే.. రోహిత్ రియాక్షన్‌ ఇదే..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) కోసం భారత జట్టును నిన్న ప్రకటించారు. ఈ సమయంలో రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

Updated : 06 Sep 2023 13:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : వన్డే వరల్డ్ కప్‌ (ODI World Cup 2023) కోసం టీమ్‌ ఇండియా తన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అయితే అగార్కర్‌ పేర్లను ప్రకటించే సమయంలో రోహిత్‌ స్పందన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

అగార్కర్‌ జట్టులోని ఒక్కొక్కరి పేరు చదివి వినిపించాడు. జాబితాలో మొదటగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరును ప్రకటించాడు. అయితే.. తన పేరు వినగానే రోహిత్‌ ఒక్కసారిగా చేతిని పైకెత్తి హే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆటగాళ్లను ప్రకటించగానే పలువురు సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా టీమ్‌ భారత్‌కు అభినందనలు తెలిపారు.

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)  ‘టీమ్‌ భారత్‌కు అభినందనలు’ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) కూడా ‘ ప్రపంచ కప్‌ మనకు ఎంతో ప్రత్యేకమైనది. దానిని ఇంటికి తీసుకొనిరండి. ఆల్‌ ది బెస్ట్‌ ’ అంటూ పోస్ట్ చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని