RCB vs GGT: రాణించిన మంధాన.. గుజరాత్‌పై బెంగళూరు ఘన విజయం

గుజరాత్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.

Updated : 27 Feb 2024 22:33 IST

బెంగళూరు: కెప్టెన్‌ స్మృతీ మంధాన (43), సబ్బినేని మేఘన (36*), ఎల్సీ పెర్రీ (23*) రాణించడంతో.. గుజరాత్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో స్మృతీ మంధాన సేనకు ఇది వరుసగా రెండో విజయం.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ బ్యాటర్లను బెంగళూరు బౌలర్లు బెంబేలెత్తించారు. కట్టుదిట్టంగా బంతులు వేసి హడలెత్తించారు. దయాలన్ హేమలత (31*), హర్లీన్‌ డియోల్ (22) ఫర్వాలేదనిపించడంతో.. గుజరాత్‌ 7 వికెట్ల నష్టానికి 107 పరుగులైనా చేయగలిగింది. వారిద్దరూ ఆడకుంటే ఇంకా తక్కువ స్కోర్‌కే GGT పరిమితమయ్యేది. సోఫీ మోలినెక్స్ 3, రేణుకా ఠాకూర్‌సింగ్‌ 2, జార్జియా వారెహమ్‌ ఒక వికెట్‌ తీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని