Sarfaraz Khan: సన్నీ సార్కు క్షమాపణలు చెబుతున్నా.. మరోసారి ఆ తప్పిదం చేయను: సర్ఫరాజ్
ఇంగ్లాండ్తో ఐదో టెస్టులో (IND vs ENG) తాను చేసిన పొరపాటును భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పునరావృతం చేయనని స్పష్టం చేశాడు. ఈసందర్భంగా సునీల్ గావస్కర్కు సారీ చెప్పడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో (IND vs ENG) జాతీయజట్టుకు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన సత్తా చాటాడు. మూడు మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 200 పరుగులు చేసిన సర్ఫరాజ్పై ఓ విషయంలో మాత్రం క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తంచేశాడు. క్రీజ్లో కుదురుకున్నాక చెత్త షాట్తో వికెట్ను సమర్పించడం సరైంది కాదని.. ప్రతిసారీ కొత్తగా బంతిని ఎదుర్కొంటాననే భావనతో ఆడే డాన్ బ్రాడ్మన్ వ్యాఖ్యలను గావస్కర్ ఉదహరించాడు. సన్నీ చేసిన వ్యాఖ్యలపై సర్ఫరాజ్ ఖాన్ కూడా బాధపడినట్లు శ్యామ్ భాటియా అనే వ్యాపారవేత్త వెల్లడించారు. సునీల్ గావస్కర్కు ఈయన అత్యంత ఆప్తులు.
‘‘సర్ఫరాజ్ ఖాన్కు సునీల్ గావస్కర్ ఓ కీలక సూచన చేశాడు. షాట్ల ఎంపికపై హెచ్చరించాడు. దాదాపు 45 నిమిషాలపాటు అతడితో సన్నీ సంభాషించాడు. కానీ, టీ బ్రేక్ తర్వాత అలాంటి చెత్త షాట్కు సర్ఫరాజ్ ఔట్ కావడంతో గావస్కర్కు కాస్త ఆగ్రహం వచ్చింది. కామెంటేటరీ సందర్భంగా ఆ విషయాన్ని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు సర్ఫరాజ్ నాతో మాట్లాడాడు. ‘గావస్కర్ సార్కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను పొరపాటు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్ భాటియా తెలిపారు.
గావస్కర్ ఏమన్నారంటే?
ఇంగ్లాండ్తో ఐదో టెస్టులో దేవదత్ పడిక్కల్తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ ఐదో వికెట్కు 97 పరుగులు జోడించాడు. రెండోరోజు టీ బ్రేక్ వరకు అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్.. ఆ తర్వాత తొలి బంతికే బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ సమర్పించాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. ‘‘బంతి ఒక్కసారిగా పైకి లేచింది. అసలు షాట్ కొట్టేందుకు అనువుగానే లేదు. అయినా ఆడేందుకు ప్రయత్నించాడు. చివరికి వికెట్ ఇచ్చేశాడు. ఇంకాస్త సమయం తీసుకుంటే బాగుండేది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడే సర్ డాన్ బ్రాడ్మన్ మాటలను గుర్తు చేసుకోవాలి. ఆయన 200 పరుగులు సాధించినా.. సరే ఎదుర్కొనే తర్వాత బంతిని ‘0’ మీదే ఉన్నాననుకుంటారు. ఇక్కడ సర్ఫరాజ్ మాత్రం తొందరపాటుతో ఔటయ్యాడు’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్