GT vs CSK: నేడు చెన్నైతో మ్యాచ్.. ధోనీ సేనకు గిల్ స్వీట్ వార్నింగ్
నేడు చెన్నై చెపాక్ వేదికగా ఐపీఎల్(IPL 2023) తొలి క్వాలిఫయర్(Qualifier 1) మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇన్ని రోజులు లీగ్ మ్యాచ్లతో అలరించిన ఐపీఎల్(IPL 2023)లో అసలు సమరం(Playoffs) నేటి నుంచే. చెన్నై చెపాక్ వేదికగా తొలి క్వాలిఫయర్(Qualifier 1) పోరుకు చెన్నై, గుజరాత్(GT vs CSK)లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచిన వారు నేరుగా ఫైనల్కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దిగ్గజ జట్ల మధ్య మరో ఉత్కంఠ పోరు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నేటి మ్యాచ్ నేపథ్యంలో గుజరాత్(Gujarat Titans) ఓపెనర్, సెంచరీల హీరో శుభ్మన్ గిల్(Shubman Gil) కీలక వ్యాఖ్యలు చేశాడు.
చెపాక్ స్టేడియంలో చెన్నై(Chennai Super Kings)ని ఎదుర్కొనేందుకు తమ వద్ద గొప్ప బౌలింగ్ దళం ఉందని ధోనీ సేనకు గిల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ‘చెపాక్ వికెట్పై చెన్నైని ఎదుర్కొనేందుకు మా వద్ద గొప్ప బౌలింగ్ దళం ఉందని నేను భావిస్తున్నాను. చెన్నైలో చెన్నైపై తలపడటం కోసం మేం ఉత్సాహంగా ఉన్నాం. రెండో సారి మేం ఫైనల్లో అడుగుపెడతామని విశ్వాసముంది’ అని గిల్ పేర్కొన్నాడు.
ఇక తన ఆట గురించి మాట్లాడుతూ.. ‘నా ఆటేంటో నాకు తెలుసు.. ఏ ఆటగాడికైనా తనకు తాను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం’ అని వివరించాడు. ‘మంచి స్టార్ట్ లభించాలి. దాన్ని పెద్ద స్కోరుగా మలచాలి. గత మ్యాచ్లో నేను అలా చేయగలిగాను’ అని తన సెంచరీ గురించి స్పందించాడు గిల్. ఈ గుజరాత్ ఓపెనర్ తాజా సీజన్లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(730) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఉండటంతో డుప్లెసిస్ను అధిగమించే అవకాశాలు గిల్కు ఎక్కువగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.