Virat Kohli: పొట్టి కప్నకు విరాట్ కోహ్లీ దూరం.. ఈ వార్తలు నిజం కాకూడదు: స్టువర్ట్ బ్రాడ్
విరాట్ కోహ్లీ లేకుండా టీ20 వరల్డ్ కప్లో (T20 World Cup 2024) భారత్ జట్టు ఆడటం అభిమానులు ఊహించగలరా? ఇదే అభిప్రాయం ఇంగ్లాండ్ మాజీ ఆటగాడికీ వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: జూన్లో మొదలయ్యే టీ20 ప్రపంచ కప్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడటం లేదు. యువ క్రికెటర్ల కోసం వైదొలుగుతున్నాడు.. ఇవీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా విరాట్తో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఆధారంగా అతడి భవితవ్యం తేలనుందనే వార్తలూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ లేకపోతే వరల్డ్ కప్ టోర్నీకి క్రేజ్ తగ్గడం ఖాయమన్నాడు. వెస్టిండీస్ - అమెరికా వేదికగా పొట్టి కప్ సంబరం ప్రారంభం కానుంది.
‘‘సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాకూడదు. అభిమానుల కోణంలో చూస్తే.. ఈ వరల్డ్ కప్ను ఐసీసీ అమెరికాలో నిర్వహించడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందరి దృష్టిని ఆకర్షించే టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తప్పకుండా పొట్టి కప్ కోసం ఎంపిక అవుతాడు’’ అని బ్రాడ్ పోస్టు చేశాడు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడలేదు. ఇటీవలే అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత విరాట్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.
ఆర్సీబీతో కలిసిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్
మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశారు. తాజాగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తన జట్టుతో కలిశాడు. ఈ మేరకు తమ జట్టు సారథి వచ్చినట్లు ఆర్సీబీ యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ‘‘కెప్టెన్ ఫాఫ్ వచ్చేశాడు. తొలి పోరు కోసం సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చాడు’’ అని క్యాప్షన్ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.