Cricket News: భారత్కు అది మంచి సమస్యే.. చాహల్ ఎంపిక ఆశ్చర్యకరం.. పాక్కు పాస్పోర్ట్ కష్టాలు..
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో ఓపెనర్లకు కొరతే లేదు. ఇప్పుడది మంచి సమస్యగా మారిందని దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. వన్డేలకు టీ20 బౌలర్ను ఎంపిక చేయడం ఓ మాజీ ఆటగాడిని సర్ప్రైజ్కు గురి చేసిందట.. ఆసీస్ పర్యటనలో ఉన్న పాక్కు వైద్యుడు లేక కష్టాలు వచ్చాయి.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
ఓపెనర్లుగా నలుగురు ఉండటంపై సునీల్ గావస్కర్
టీ20 ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవుతున్న టీమ్ఇండియాకు ప్రధాన సమస్య జట్టు కూర్పేనని మాజీ క్రికెటర్లు ఆందోళన చెందుతున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం ఇది తప్పకుండా భారత్కు మంచి సమస్యేనని వ్యాఖ్యానించాడు. ‘‘దక్షిణాఫ్రికాతో సిరీస్కు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా ఉన్నారు. ఒకవేళ జట్టు మేనేజ్మెంట్ ఎడమచేతివాటం బ్యాటర్తో బరిలోకి దిగాలని భావిస్తే యశస్వికి అవకాశం దక్కుతుంది. అప్పుడు గిల్తోపాటు యశస్వి ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. ఇక టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడని చెబుతున్నారు. దీంతో నలుగురు ఓపెనర్లు సిద్ధంగా ఉన్నట్లవుతుంది’’ అని గావస్కర్ తెలిపాడు.
వన్డేలకు చాహల్ ఎంపిక ఆశ్చర్యకరం
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు యుజ్వేంద్ర చాహల్ను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ‘‘చాహల్ టీ20 స్పెషలిస్ట్. అతడిని పొట్టి సిరీస్కు ఎంపిక చేయకపోవడం.. వన్డేలకు తీసుకోవడం సర్ప్రైజ్కు గురి చేసింది. భారత మేనేజ్మెంట్ ‘పనిభారం’ తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. దీపక్ చాహర్, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు మళ్లీ అవకాశం దక్కింది. ముకేశ్ కుమార్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. రజత్ పటీదార్ను జట్టులో చూడటం ఆనందంగా ఉంది. టీ20లు ఆడిన రింకు సింగ్కు ప్రమోషన్ వచ్చింది. వన్డే ఫార్మాట్లోనూ అడుగు పెట్టబోతున్నాడు. సంజూ శాంసన్కు చాన్నాళ్ల తర్వాత ఛాన్స్ వచ్చింది. అయితే, అతడు ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది’’ అని సంజయ్ వ్యాఖ్యానించాడు.
పాస్పోర్ట్ గడువు ముగియడంతో..
పాకిస్థాన్ సీనియర్ జట్టుతోపాటు అండర్-19 టీమ్కు కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న పాక్ తమ జట్టు డాక్టర్ లేకుండానే ఆడాల్సిన పరిస్థితి. పాస్పోర్ట్ గడువు ముగియడంతో పాక్ టీమ్ వైద్యుడు సోహైల్ సలీమ్ ఆసీస్కు వెళ్లలేకపోయాడు. ‘‘ పాక్ క్రికెట్ బోర్డు ఈ విషయంపై దృష్టిసారించింది. డాక్టర్ సలీమ్ పాస్పోర్ట్ను త్వరగా రెన్యువల్ చేయించి ఆసీస్తో పెర్త్ టెస్టు సమయానికైనా జట్టు వద్దకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది’’ అని పీసీబీ వర్గాల వెల్లడించాయి.
మాజీ ఆటగాడు, అండర్ -19 టీమ్ మేనేజర్ షోయబ్ మహమ్మద్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్ కోసం యూఎఈలో పాక్ జట్టు ఉంది. అయితే, షోయబ్ పాస్పోర్ట్ గడువు కూడా ముగిసింది. దీంతో అతడు జట్టుతోపాటు వెళ్లలేకపోయాడు. ‘‘షోయబ్ కూడా పాస్పోర్ట్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. త్వరలోనే జట్టుతో చేరేందుకు యూఏఈ చేరుకుంటాడు’’ అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్