IND vs AFG: మ్యాచ్లో హైడ్రామా.. రెండో సూపర్ ఓవర్లో భారత్ విజయం..
అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించి సిరీస్ క్లీన్స్వీప్ చేసింది.
ఓ వైపు క్లీన్స్వీప్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న భారత్.. మరోవైపు ఒక్కమ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అఫ్గాన్.. ఇలా ప్రారంభమైన మూడో టీ20 మ్యాచ్ అత్యంత నాటకీయంగా ముగిసింది.
తొలుత భారీ స్కోర్ చేసిన టీమ్ఇండియా.. విజయం తమదేనన్న భరోసాతో ఉన్న వేళ.. ప్రత్యర్థి జట్టు అనూహ్యంగా చెలరేగడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు వెళ్లింది. ఇక అక్కడా అదే హైడ్రామా.. ఫలితం మళ్లీ రిపీట్..
ఇక రెండో సూపర్ ఓవర్లోనూ అదే ఉత్కంఠ.. బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన వేళ.. ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. అయితే ఇక్కడే మన బౌలర్ బిష్ణోయ్ మాయ చేసి భారత్ను విజయతీరాలకు చేర్చాడు.
బెంగళూరు: అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో టీ20 (IND vs AFG) భారత్ విజయం సాధించింది. అత్యంత నాటకీయంగా రెండోసారి సూపర్ ఓవర్కు దారితీసిన ఈ మ్యాచ్లో భారత్ (Team India) గెలుపొంది సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తొలుత భారత్ నిర్దేశించిన 212 లక్ష్యాన్ని అఫ్గాన్ (Afghanistan) సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి నాలుగు బంతుల్లో 14 పరుగులు చేసింది. రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే చాలు. అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు రావడంతో మళ్లీ స్కోర్ సమం అయింది. దీంతో మ్యాచ్ రెండోసారి సూపర్ ఓవర్కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 11 పరుగులే చేసి ప్రత్యర్థికి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక బౌలింగ్కు దిగిన బిష్ణోయ్ మూడు బంతుల్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్ కథ ముగిసింది.
రోహిత్, రింకు ఆకాశమే హద్దుగా..
తొలుత భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (4), కోహ్లీ (0), శివమ్ దూబె (1), సంజు శాంసన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లు), రింకు సింగ్ (69*; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. చివరి ఐదు ఓవర్లలో భారత్ ఏకంగా 103 పరుగులు చేసింది. దీంతో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
ఈ భారీ లక్ష్యఛేదనలో అఫ్గాన్ చివరి బంతి దాకా పోరాడి ఆరు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (50; 32 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గుల్బాదిన్ నైబ్ (55* 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), మహ్మద్ నబీ (34; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
రెండు సూపర్ ఓవర్లు సాగాయి ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్