Dinesh Karthik: కార్తిక్ మంచి ఫినిషరే.. కానీ వీళ్లే అసలైన ఫినిషర్లు: మాజీ క్రికెటర్
మ్యాచ్ను అద్భుతంగా ముగించి..జట్టును గెలిపించే ఫినిషర్లు చాలా అరుదుగా ఉంటారు.
ఇంటర్నెట్ డెస్క్: మ్యాచ్ను అద్భుతంగా ముగించి.. జట్టును గెలిపించే ఫినిషర్లు అరుదుగా ఉంటారు. ఇటీవల భారత టీ20 లీగ్లో అదరగొట్టి టీమ్ఇండియాలోకి (Team India) రీ-ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఫినిషర్గా పేరు తెచ్చుకుంటున్నాడు. మ్యాచ్ చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా కప్కు (Asia Cup) ఎంపిక చేసిన బృందంలోనూ చోటు సంపాదించాడు. ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ 20 ప్రపంచకప్కు (T20 World Cup) డీకే ఈ కోటాలోనే బెర్త్ ఖాయం చేసుకుంటాడని క్రికెట్ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, భారత జట్టు మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ (Srikanth) మాత్రం భిన్నంగా స్పందించాడు. టీమ్ ఇండియాలో ఫినిషర్ పాత్రపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫినిషర్కు స్పష్టమైన అర్థం చెప్పాలనుకుంటున్నాను. టీమ్ ఇండియాలో ఫినిషర్ అంటున్న కార్తిక్ ఇటీవల మంచి ప్రదర్శనలే చేశాడు. ఆ లెక్కన డీకే మంచి ఫినిషరే.. కానీ చివరి 5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే అతను గొప్ప ఫినిషర్ అని చెప్పలేను. ఫినిషర్ అంటే 8 నుంచి 12 ఓవర్ల మధ్య బ్యాటింగ్కు వచ్చి 20వ ఓవర్ వరకు కొనసాగి, మ్యాచ్ని గెలిపించగలగాలి. నా దృష్టిలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫినిషర్. రిషభ్ పంత్ తెలివైన ఫినిషర్. వీరితో పాటు హార్దిక్ పాండ్య కూడా ఈ లిస్ట్లో ఉన్నాడు. వీరినే నేను బెస్ట్ ఫినిషర్లుగా భావిస్తాను
- శ్రీకాంత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు