Tokyo Olympics: హాకీ ఇండియా పసిడి ఆశలు ఆవిరి.. సెమీస్లో 5-2తో ఓటమి.. ఇక కాంస్య పోరుకు సై
హాకీ ఇండియా సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో నిలిచింది. పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్లో పరాజయం చవిచూసింది. ప్రపంచ నంబర్ వన్, కఠిన ప్రత్యర్థి బెల్జియం..
హాకీ ఇండియా.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. మన్ప్రీత్ సేన పసిడి పోరుకు అర్హత సాధించలేకపోయింది. సువర్ణాధ్యాయం లిఖించే అవకాశం చేజార్చుకుంది. రజతమైనా సరే మురిసిపోదాం అనుకుంటే..! సెమీస్లోనే పురుషుల జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆశలన్నీ కాంస్య పతకంపైనే..! ఆఖరి నిమిషం వరకు పోరాడిన టీమ్ఇండియా కంచు పోరులోనైనా 41 ఏళ్ల పతకాల కరవుకు తెరదించాలి.
చిత్తు చేసిన ఒత్తిడి
ఒత్తిడి.. ఒత్తిడి.. ఒత్తిడి.. బెల్జియంతో సెమీస్ పోరులో ఒత్తిడే రాజ్యమేలింది! 49 ఏళ్ల తర్వాత అతిపెద్ద పోరులో టీమ్ఇండియా ఒత్తిడికి తలొగ్గింది. నరాలు మెలేసే ఆ ఒత్తిడిని జయించిన ప్రపంచ నంబర్వన్ బెల్జియం 5-2 తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఆశలను ఆవిరి చేసింది. మూడు క్వార్టర్ల వరకు అద్భుతంగా పోరాడిన మన్ప్రీత్ సేన ఆఖరి క్వార్టర్లో చివరి ఐదు నిమిషాల వరకు విజయంపై ఆశలు రేపడం గమనార్హం. అయితే అలెగ్జాండర్ హెండ్రిక్స్ 19, 49, 53 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్తో టీమ్ఇండియా కలలను చిదిమేశాడు.
తొలి క్వార్టర్ 2-1తో భారత్దే
ఆట ఆరంభించిన రెండో నిమిషంలోనే లుయిపెర్ట్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి బెల్జియంకు శుభారంభం అందించాడు. ఏడో నిమిషంలో హర్మన్ప్రీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి 1-1తో స్కోరు సమం చేశాడు. మరో రెండు నిమిషాలకే మన్ప్రీత్ సింగ్ (9 ని) అద్భుతమైన ఫీల్డ్గోల్ చేసి 2-1తో భారత్ను ఆధిక్యంలో నిలిపాడు. డిఫెన్స్లో కాస్త తడబడిన టీమ్ఇండియా బెల్జియంకు ఎక్కువ పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఇచ్చింది. ఆ జట్టుకు 14 సార్లు పీసీలు దక్కాయి. 19వ నిమిషంలో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్లు రావడంతో హెండ్రిక్స్ మూడో దఫాలో గోల్ కొట్టేసి 2-2తో స్కోరు సమం చేశాడు.
మూడో క్వార్టర్ వరకు హోరాహోరీ
మూడో క్వార్టర్లో రెండు జట్లు గోల్ చేసేందుకు శ్రమించాయి. నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. రెండు జట్లూ దూకుడుగా ఆడటంతో ఆట ఉత్కంఠకరంగా సాగింది. బంతిని బాగానే అదుపులో ఉంచుకున్న టీమ్ఇండియా గోల్స్ కోసం ప్రయత్నించింది. అయితే బెల్జియం మిడ్ ఫీల్డర్లు, మిగతా ఆటగాళ్లు సర్కిల్ను చుట్టుముట్టి గోల్స్ కాకుండా అడ్డుకున్నారు. భారత్కు వచ్చిన ఐదు పెనాల్టీ కార్నర్లలో ఒకటే విజయవంతం కావడంతో స్కోరు చేసేందుకు అవకాశం దొరకలేదు.
ఆఖర్లో కొంపముంచిన పీసీలు
నాలుగో క్వార్టర్ను 2-2తో మొదలు పెట్టిన రెండు జట్లు ఒత్తిడిలోనే ఆడాయి. అయితే టీమ్ఇండియా పదేపదే బంతిని అడ్డుకోవడంతో బెల్జియంకు ఆయాచితంగా వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. మరోసారి హెండ్రిక్స్ ఒక పీసీని, ఒక పెనాల్టీ స్ట్రోక్ను గోల్స్గా మలవడంతో బెల్జియం 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. సమయం తక్కువగా ఉండటంతో ఒత్తిడి పెరిగిన టీమ్ఇండియా గోల్కీపర్ శ్రీజేశ్నూ మైదానంలోకి దింపింది. అయితే దుర్భేద్యమైన డిఫెన్స్తో బెల్జియం మన్ప్రీత్ సేనను అడ్డుకుంది. ఇక ఆట ముగిసే ఆఖరి సెకన్లోనూ దొహెమన్ గోల్ చేసి బెల్జియంను 5-2తో గెలిపించాడు. ఇక టీమ్ఇండియా కాంస్య పోరులోనైనా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్