Rahul Dravid: లఖ్నవూ మెంటార్గా ద్రవిడ్? టీమ్ఇండియా కోచ్గా లక్ష్మణ్!
టీమ్ఇండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది. అతడు తిరిగి కోచ్గా కొనసాగకపోతే ఐపీఎల్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించే అవకాశముంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్తో టీమ్ఇండియా (Team India) ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీ కాలం ముగిసింది. ద్రవిడ్ సరేనంటే బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశముంది. కానీ, అతడు ఈ పదవిలో కొనసాగేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు మెంటార్గా ఉన్న గౌతమ్ గంభీర్ తిరిగి కేకేఆర్ గూటికి చేరుకున్నాడు. దీంతో గంభీర్ స్థానంలో ద్రవిడ్ను మెంటార్గా నియమించుకునేందుకు లఖ్నవూ యాజమాన్యం ఆసక్తి చూపుతునట్లు సమాచారం. ద్రవిడ్కి టీమ్ఇండియా కోచ్గా కొనసాగే ఉద్దేశం లేకపోవడంతో ఎల్ఎస్జీకి మెంటార్గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కోచ్, భారత జట్టు భవిష్యత్పై కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో బీసీసీఐ డిసెంబరు 2 లేదా 3న సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం ద్రవిడ్ కోచ్గా కొనసాగుతాడా లేదా తేలనుంది. కోచ్గా ద్రవిడ్ కొనసాగకపోతే నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman)ను ఆ స్థానంలో నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసీస్తో ఐదు టీ20ల సిరీస్కు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తున్నాడు. జూనియర్లు అధికంగా ఉన్న జట్టుతో లక్ష్మణ్ పలు పర్యటనలకు వెళ్లిన విషయం తెలిసిందే.
చైనా మాస్టర్స్ ఫైనల్లో అడుగుపెట్టిన సాత్విక్, చిరాగ్ జోడీ
చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్లో సెమీఫైనల్లో చైనా ద్వయం జి టింగ్, రెన్ జియాంగ్ యు పై 21-15, 22-20 తేడాతో విజయం సాధించింది. 50 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో తొలి గేమ్లో భారత జోడీ సునాయాసంగా గెలుపొందింది. రెండో గేమ్లో మాత్రం చైనా ద్వయం నుంచి గట్టిపోటీ ఎదురైంది. రెండో గేమ్ విరామ సమయానికి సాత్విక్, చిరాగ్ జోడీ 8-11తో వెనకబడింది. కోచ్ గోపీచంద్ భారత ద్వయంతో మాట్లాడిన అనంతరం ఈ జోడీ పుంజుకుని 14-14తో నిలిచింది. చివర్లో చైనా జోడీ జోరు తగ్గడంతో గేమ్ భారత్ వశమైంది. నవంబర్ 26న (ఆదివారం) ఫైనల్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’