Ravindra Jadeja: టీమ్ఇండియాకు షాక్.. రెండో టెస్టుకు జడేజా అనుమానమే?
Ravindra Jadeja: టీమ్ఇండియా ఆల్రౌండర్ జడేజా రెండో టెస్టులో ఆడటం అనుమానంగానే కన్పిస్తోంది. తొలి టెస్టులో అతడి తొడ కండరాలు పట్టేశాయి.
హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు (IND vs ENG) ఓటమితో షాక్లో ఉన్న టీమ్ఇండియా (Team India)కు మరో ఎదురుదెబ్బ తగిలేట్లుంది..! ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో రెండో టెస్టుకు అతడు ఆడటం కష్టమనే ప్రచారం జరుగుతోంది.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అనవసరంగా పరుగు కోసం యత్నించి జడ్డూ రనౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వేగంగా పరిగెత్తడంతో అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఇబ్బందిపడుతూనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం అతడికి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇంకా ఫిజియోను సంప్రదించలేదు. ఇప్పుడే అతడి పరిస్థితి గురించి ఏమీ చెప్పలేం’’ అని అన్నాడు.
జడ్డూ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ఎలాంటి చీలిక లేకుండా కేవలం కండరాలు పట్టేసినా వైద్యులు అతడికి కనీసం వారం పాటు విశ్రాంతి సూచించే అవకాశాలున్నాయి. అయితే, మరో నాలుగు రోజుల్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో అతడు ఈ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా?అనేది అనుమానంగానే కన్పిస్తోంది. జట్టుతో కలిసి జడేజా వైజాగ్ వెళ్తాడా లేదా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపిస్తారా? అన్నదానిపై బీసీసీఐ నేడు స్పష్టతనిచ్చే అవకాశముంది.
రెండో ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫీల్డింగ్తో జడ్డూను రనౌట్ చేయడం మ్యాచ్ను మలుపుతిప్పింది. వైజాగ్ టెస్టుకు అతడు దూరమవడం టీమ్ఇండియాకు ప్రతికూలాంశమే. ఈ ఆల్రౌండర్ తొలి టెస్టులో 87 పరుగులతో భారత టాప్ స్కోరర్గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఐదు వికెట్లు సాధించాడు.
ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో మరో రోజు మిగిలి ఉండగానే అనూహ్యంగా భారత్ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ స్పిన్కు కుదేలైన రోహిత్ సేన.. ఉప్పల్లో టెస్టుల్లో అజేయ రికార్డును చేజేతులా కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.