Team India: ఎనిమిది ఫైనల్స్.. ఏడు టైటిల్స్.. వీరే కెప్టెన్స్..!
మహిళల ఆసియా కప్ చరిత్రలో టీమ్ఇండియాది సువర్ణాధ్యాయం. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు టోర్నీలు జరగగా.. ఏడు టైటిళ్లను భారత్ గెలుచుకోవడం అద్భుతం. తొలి ఆసియా కప్ నుంచి తాజాగా జరిగిన టోర్నీ వరకు ఏ కెప్టెన్ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుందో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. ఆసియాకప్లో చరిత్ర సృష్టించారు. ఏడో టైటిల్ను సాధించారు. 2004లో రెండు జట్లతో ప్రారంభమైన మహిళల ఆసియాకప్లో తాజాగా ఏడు దేశాల జట్లు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు టోర్నమెంట్ జరిగింది. అంతేకాకుండా ఫైనల్లో భారత్కు ఐదు సార్లు శ్రీలంక ప్రత్యర్థి కావడం గమనార్హం. తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ గెలిచింది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సారథ్యంలో అత్యధికంగా నాలుగు టైటిళ్లను అందుకోవడం ఒక రికార్డే.
- తొలి కప్ ‘మమత’ (2004): శ్రీలంక వేదికగా మహిళల కోసం 18 ఏళ్ల కిందట రెండు జట్లతో ఆసియా కప్ ప్రారంభమైంది. వన్డే ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీ తొలి టైటిల్ను టీమ్ఇండియా కైవసం చేసుకొంది. కెప్టెన్గా మమతా మబెన్ వ్యవహరించింది. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్లు నిర్వహించగా.. 5-0 తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. దీంతో మొదటి టైటిల్ భారత్ వశమైంది.
- మిథాలీ సారథ్యంలోనే..(2005/06): ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మొదటిసారిగా 2005లో ఆసియా కప్ టైటిల్ను అందుకొంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండో కప్ను ఖాతాలో వేసుకొంది. అయితే ఈసారి భారత్-లంక కాకుండా మూడో జట్టు వచ్చి చేరింది. అదే దాయాది దేశం పాకిస్థాన్. 2005 ఆసియా కప్ను అక్కడే నిర్వహించారు. మూడు టీమ్లు కలిసి లీగ్ స్టేజ్లో ఆరు మ్యాచ్లు ఆడాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అలాగే 2006లో జరిగిన కప్నూ మిథాలీరాజ్ కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకొంది. రెండుసార్లూ లంకనే ప్రత్యర్థి. వేదిక భారత్ కావడవం విశేషం.
- నాలుగుకు పెరిగినా.. (2008): ఈసారి టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల సంఖ్య 4కి చేరింది. కొత్తగా బంగ్లాదేశ్ టీమ్ వచ్చింది. గ్రూప్లో భారత్, శ్రీలంక జట్లు టాపర్లుగా నిలిచి ఫైనల్కు చేరుకొన్నాయి. టీమ్ఇండియా ఆరు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. లంక నాలుగు గెలిచి.. రెండింట్లో ఓడింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కేవలం ఒక్కో విజయంతోనే సరిపెట్టుకొన్నాయి. తుదిపోరులోనూ లంకను కెప్టెన్ మిథాలీరాజ్ నాయకత్వంలోని భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది.
- ఎనిమిది జట్లు (2012): అంతకుముందు జరిగిన ఆసియా కప్ పోటీలకు 2012 ఆసియా కప్ టోర్నీకి నాలుగేళ్ల వ్యవధి ఉండటం గమనార్హం. అయితే ఈ సారి ఏకంగా ఎనిమిది జట్లు తలపడ్డాయి. తొలిసారిగా టీ20 ఫార్మాట్ను ప్రవేశపెట్టారు. మొదటిసారి చైనా ఆతిథ్యం ఇవ్వడంతోపాటు పాల్గొంది. రెండు గ్రూప్లుగా విడిపోయిన జట్లు.. నాకౌట్ దశకు మాత్రం నాలుగే చేరాయి. భారత్-శ్రీలంక ఈసారి సెమీస్లోనే ఢీకొట్టుకోగా.. బంగ్లాదేశ్-పాకిస్థాన్ మొదటిసారి సెమీఫైనల్కు వచ్చాయి. అయితే ఫైనల్కు టీమ్ఇండియా-పాక్ చేరుకోగా.. టైటిల్ను భారత్ సొంతం చేసుకొంది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించగా.. హర్మన్ డిప్యూటీగా వ్యవహరించింది.
- మళ్లీ పాక్నే ప్రత్యర్థి (2016): భారత్కు వరుసగా రెండోసారి ఫైనల్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా తలపడింది. అయితే ఈసారి మాత్రం ఆరు జట్లతోనే ఆసియా కప్ జరిగింది. హాంకాంగ్, చైనా పాల్గొనలేదు. థాయ్లాండ్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో ఆరు జట్లూ మిగతా టీమ్లతో రెండేసి మ్యాచ్లను ఆడాయి. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు వచ్చాయి. అలా భారత్-పాక్ మరోసారి తలపడగా.. టీమ్ఇండియానే విజయం సాధించి కప్ను ఖాతాలో వేసుకొంది. తొలిసారి హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గెలిచిన టైటిల్.
- ఇప్పుడు శ్రీలంకపైనే (2022): హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ 2018 ఆసియా కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడినా ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్ 2022లో కసిగా దిగిన టీమ్ఇండియా ఆద్యంతం దూకుడుగానే ఆడింది. ఒక్క మ్యాచ్ మినహా అన్నింట్లోనూ విజయం సాధించి టైటిల్ను పట్టేసింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా దీప్తి శర్మ.. ఫైనల్లో ప్లేయర్ ది మ్యాచ్ అవార్డును రేణుకా సింగ్ అందుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు