UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా... ప్రపంచకప్కు సిద్ధమవుతోన్న స్టేడియం
వరల్డ్ కప్ (ODI World Cup 2023) సొబుగులు ఆ స్టేడియానికి వచ్చేశాయి. అక్కడ భారత మ్యాచ్లు లేవు.. అయినా టికెట్లకూ విపరీతమైన డిమాండ్ నెలకొందంటే తెలుగు అభిమానులకు క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ ఏంతనేది అర్థమైపోతుంది.
బాబర్ అజామ్ కళాత్మక బ్యాటింగ్.. షహీన్ షా అఫ్రిది ప్రమాదకర బౌలింగ్! బ్యాట్తో అదరగొట్టే డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్.. బంతితో చెలరేగే బౌల్ట్.. కుదిరితే కేన్ మామ ఆట! స్మిత్, వార్నర్ మెరుపులు.. మ్యాక్స్వెల్, స్టాయినిస్, గ్రీన్ ఆల్రౌండ్ విన్యాసాలు.. కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్ బుల్లెట్ బంతులు! పరుగుల వేటలో సాగే కుశాల్ మెండిస్, నిశాంక, శానక.. బంతిని గింగిరాలు తిప్పే దునిత్, హసరంగ (గాయం నుంచి కోలుకుంటే)! ఇప్పుడు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఆటగాళ్ల ప్రస్తావన ఒక దగ్గరే ఎందుకని అనుకుంటున్నారా? వీళ్లు వేర్వేరు జట్ల ఆటగాళ్లే కానీ.. ఉప్పల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 5న ఆరంభమయ్యే ప్రపంచకప్ నేపథ్యంలో ఇక్కడ తమ జట్ల తరపున ఈ ఆటగాళ్లు బరిలో దిగబోతున్నారు. హైదరాబాద్లో మూడు ప్రపంచకప్ ప్రధాన మ్యాచ్లతో పాటు రెండు వార్మప్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చేందుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది.
ఆ నిరాశను దాటేలా..
ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడ్డారు. రెండు వార్మప్ సహా ఉప్పల్ స్టేడియానికి బీసీసీఐ అయిదు మ్యాచ్లు కేటాయించింది. కానీ ఇందులో ఒక్కటి కూడా టీమ్ఇండియా మ్యాచ్ లేకపోవడం నిరాశ కలిగించింది. కానీ ఆ లోటును తీర్చేలా.. అభిమానులకు అత్యుత్తమ క్రికెట్ అనుభూతిని అందించేందుకు ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. మొట్టమొదటి సారి ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చేందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సిద్ధమవుతోంది. ఓవరాల్గా హైదరాబాద్లో 27 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. చివరగా ఎల్బీ స్టేడియంలో 1996 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్ జరిగింది.
మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్ ఆధిపత్యం
ఇప్పుడు ప్రపంచకప్ నేపథ్యంలో మూడు ప్రధాన మ్యాచ్లతో పాటు అంతకంటే ముందు రెండు వార్మప్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ వేదికలో పాకిస్థాన్ అత్యధికంగా నాలుగు మ్యాచ్లాడనుంది. నెదర్లాండ్స్, న్యూజిలాండ్ రెండేసి చొప్పున మ్యాచ్లాడతాయి. ఈ నెల 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ మొదటి వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 3న ఉప్పల్లో జరిగే రెండో వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ ఢీ కొడుతుంది. అసలైన ప్రపంచకప్ మ్యాచ్ల్లో.. అక్టోబర్ 6న నెదర్లాండ్స్తో పాకిస్థాన్, అక్టోబర్ 9న నెదర్లాండ్స్తో న్యూజిలాండ్, అక్టోబర్ 10న శ్రీలంకతో పాకిస్థాన్ తలపడతాయి.
సరికొత్త హంగులతో..
2006 నుంచి ఇప్పటివరకూ ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్లో 5 టెస్టులు, 7 వన్డేలు, 3 టీ20లు జరిగాయి. గతంలో ఓ వైపు పైకప్పు మధ్యలో కొంచెం ఎగిరిపోయి, కుర్చీలు అక్కడక్కడా విరిగిపోయి, తాగునీటి ఇబ్బంది తదితర సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచకప్ కోసం ఉప్పల్ స్టేడియాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సరికొత్తగా ముస్తాబు చేస్తోంది. స్టేడియం ఆధునీకీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దక్షిణం వైపు గతంలో భారీ వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో ఇప్పుడు కొత్తదాన్ని బిగించారు. తూర్పు పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త ఎల్ఈడీ ఫ్లడ్లైట్లు కూడా ఏర్పాటు చేశారు. 39 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంలో ప్రపంచకప్ వరకు 12 వేల వరకు కొత్త కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచకప్ తర్వాత మిగతా కుర్చీలతో పాటు పశ్చిమ వైపు పైకప్పు కూడా ఏర్పాటు చేస్తారు. వర్షం పడ్డ మైదానంలో నీరు నిలవకుండా ఉండటం కోసం డ్రైనేజీ వ్యవస్థనూ మెరుగుపరిచారు. కొత్త రంగులతో స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అభిమానుల కోసం ఉచితంగా నాణ్యమైన తాగునీటి వసతి కల్పించనున్నారు.
అదే జోష్..
హైదరాబాద్లో మ్యాచ్ అంటే చాలు స్టేడియం కిక్కిరిసిపోవడం ఖాయం. తెలుగు రాష్ట్రాల అభిమానులకు క్రికెట్పై ఉన్న అభిమానం అలాంటిది. ఐపీఎల్ అయినా అంతర్జాతీయ మ్యాచ్ అయినా స్టేడియం పూర్తిగా నిండుతుంది. ఇప్పుడు ప్రపంచకప్లో ఇక్కడ భారత జట్టు మ్యాచ్లు లేనప్పటికీ.. ఇతర మ్యాచ్లకు సంబంధించిన టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని బట్టే క్రికెట్పై మన అభిమానుల ఇష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నెల 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరిగే అవకాశముంది. గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకల నేపథ్యంలో మ్యాచ్కు భద్రత ఇవ్వలేమని పోలీసులు అంటున్నారు. అయితే మిగతా నాలుగు మ్యాచ్లకు మాత్రం ప్రేక్షకులను అనుమతిస్తారు. ఈ మ్యాచ్ల్లో విదేశీ ఆటగాళ్ల ఆటను ఆస్వాదిస్తూ మన అభిమానులు కేరింతలు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!