బిగ్బాష్లోకి యువీ..!
టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ మరో ప్రఖ్యాత లీగ్పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ ‘బిగ్బాష్’లో ఆడాలని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం.....
ఫ్రాంచైజీని వెతుకుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా
మెల్బోర్న్: టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ మరో ప్రఖ్యాత లీగ్పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ ‘బిగ్బాష్’లో ఆడాలని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం.
ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక క్రికెట్ లీగ్గా ‘బిగ్బాష్’కు పేరుంది. భారతీయులు మినహా ప్రపంచ దేశాల క్రికెటర్లు అందులో భాగం అవుతున్నారు. మహిళా క్రికెటర్లు మినహా పురుషులు ఇతర దేశాల లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు మాత్రం అనుమతి ఇస్తోంది. సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్ వంటి వెటరన్ క్రికెటర్లు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన యువీ.. కెనడా టీ20 లీగ్, టీ10 వంటి లీగుల్లో ఆడాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం టోర్నీలేమీ జరగడం లేదు. ఎంతో కష్టపడితే గానీ ఐపీఎల్ వంటి లీగులు సాధ్యమవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ‘బిగ్బాష్’లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా యువీ కోసం ఓ ఫ్రాంచైజీని గుర్తించే పనిలో పడిందని అతడి మేనేజర్ జేసన్ వార్న్ (డబ్ల్యూ స్పోర్ట్స్, మీడియా) చెప్పినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్లో ఓ కథనం వచ్చింది.
భారతీయ క్రికెటర్లు బిగ్బాష్లో ఆడితే టోర్నీ విలువ మరింత పెరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు షేన్ వాట్సన్ పేర్కొన్నారు. బిగ్బాష్పై యువీ ఆసక్తి ప్రదర్శించడంపై అతడు స్పందించాడు. ‘ఇలాంటి టోర్నీల్లో భారతీయులు ఆడితే అద్భుతంగా ఉంటుంది. పరిస్థితులు అలాగే ఉన్నాయి. భారత్లో ప్రపంచస్థాయి టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. వారు స్వదేశంలో తప్ప ఎక్కడా ఆడటం లేదు. బిగ్బాష్ సహా ప్రపంచ లీగులకు వారు అందుబాటులో ఉంటే బాగుంటుంది’ అని అన్నాడు. ‘ఇదే నిజమైతే టోర్నీల్లో పోటీతత్వమే మారిపోతుంది’ అని పేర్కొన్నాడు. వాట్సన్ ఇప్పుడు చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.