అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే..
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. అంతరిక్ష కమ్యూనికేషన్ల వ్యవస్థను కొత్త మలుపు తిప్పే అవకాశముండటం రెండో ప్రయోజనం. సైకీ వ్యోమనౌక మీద బిగించిన ట్రాన్సీవర్ ఇటీవలే భూమి వైపు విజయవంతంగా లేజర్ సంకేతాన్ని పంపించి ఔరా అనిపించింది. అంతరిక్షంలో అక్కడెక్కడో.. భూమికి 1.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి దీన్ని ప్రసారం చేసి అబ్బుర పరిచింది. సుదూర అంతరిక్షం నుంచి వీడియో ప్రసారాలను సుసాధ్యం చేయగల ఇది భవిష్యత్ ప్రయోగాలకు కీలకం కానుందని భావిస్తున్నారు. ఇదేం ప్రయోగం? ఇందులో లేజర్ల ప్రాధాన్యమేంటి?
👉 Follow EENADU WhatsApp Channel
అంతరిక్ష పరిశోధనల్లో వ్యోమనౌకలు సమాచారాన్ని సేకరించటం, దాన్ని తిరిగి భూమికి పంపించటం చాలా కీలకమైన అంశం. అయితే ఇదంత తేలికైక పని కాదు. చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది డేటా ప్రసార వేగం. ఒకవైపు వ్యోమనౌకలు అత్యంత వేగంతో అంతరిక్షంలో ప్రయాణిస్తుంటాయి. మరోవైపు భూమి మీది కేంద్రాలతో అనుసంధానమై సమాచారాన్ని పంపించాల్సి ఉంటుంది. ఇదెలా సాధ్యమవుతుంది? భూమ్మీది వైర్లెస్ కమ్యూనికేషన్ల మాదిరిగానే వ్యోమనౌకలు కూడా పలు విద్యుదయస్కాంత పౌనఃపున్యాల పట్టికల మీద డేటాను ఎన్కోడ్ చేస్తాయి. చాలా అంతరిక్ష కమ్యూనికేషన్లు రేడియో తరంగాల ఆధారంగానే పనిచేస్తున్నాయి. పెద్ద తరంగధైర్ఘ్యాలతో కూడుకొని ఉండే ఇవి విద్యుదయస్కాంత చట్రంలో తక్కువ పౌనఃపున్యం కలిగుంటాయి. అధిక బ్యాండ్విడ్త్లు సెకండుకు మరింత అధిక డేటాను ప్రసారం చేస్తాయి. అందుకే శాస్త్రవేత్తలు అత్యధిక బ్యాండ్విడ్త్లో డేటాను ప్రసారం చేయటానికే ప్రాధాన్యమిస్తుంటారు. విద్యుదయస్కాంత తరంగాల్లో కమ్యూనికేషన్ కోసం ఎక్కువగా వాడుతున్నవి రేడియో తరంగాలే. వీటికి బదులు లేజర్ కాంతిని వాడుకోవటానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. నాసా రూపొందించిన అధునాతన డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (డీఎస్ఓసీ) మూలసూత్రం ఇదే. విద్యుదయస్కాంత పట్టికలో భాగమైన నియర్ ఇన్ఫ్రారెడ్లో కాంతి తరంగధైర్ఘ్యాలు చాలా చిన్నగా.. నానోమీటర్లలో ఉంటాయి. పౌనఃపున్యం చాలా అధికంగా ఉంటుంది. అందువల్ల తక్కువ స్థలంలోనే పెద్ద మొత్తంలో సమాచారం పడుతుంది. రేడియో తరంగాల కన్నా 10 నుంచి 100 రెట్లు ఎక్కువ వేగంతో డేటా పంపిణీ అవుతుంది.
ఏంటీ ప్రత్యేకత?
భూమి-చంద్రుడికి ఆవల మొట్టమొదటి ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇదే. వ్యోమనౌకకు అనుసంధానించిన లేజర్ ట్రాన్సీవర్, భూమ్మీద నెలకొల్పిన లేజర్ ట్రాన్స్మిటర్, లేజర్ రిసీవర్ ఇందులో భాగాలు. ఇటీవల ప్రయోగించిన సైకీ వ్యోమనౌక నుంచి సమాచారం అందుకోవటం కోసం నియర్ ఇన్ఫ్రారెడ్ లేజర్ సంకేతాలను ఉపయోగించుకోవటం దీనిలోని కీలకాంశం. పాత టెలిఫోన్ తీగల స్థానంలో వచ్చిన ఫైబర్ ఆప్టిక్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అత్యంత వేగంగా డేటాను మార్పిడి చేయటం ద్వారా సమాచార ప్రసార వేగాన్ని గణనీయంగా పెంచింది. దీని మాదిరిగానే డీఎస్ఓసీ కూడా రేడియో టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేగంతో డేటాను ప్రసారం చేయగలదని నాసా చెబుతోంది. కాబట్టి అత్యధిక రెజల్యూషన్ ఫొటోలు, పెద్ద మొత్తంలో సైన్స్ డేటా.. చివరికి అంతరిక్షం నుంచి ప్రత్యక్ష వీడియో ప్రసారాలూ సాధ్యమవుతాయని వివరిస్తోంది.
తొలిసారిగా..
డీఎస్ఓసీ ట్రాన్సీవర్ను మోసుకెళ్తున్న మొట్టమొదటి వ్యోమనౌక సైకీనే. ఇది గ్రహశకలాన్ని చేరుకునే క్రమంలో తొలి రెండేళ్లలో భూమికి అధిక బ్యాండ్విడ్త్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ప్రసారాలను పరీక్షించనుంది. దీని డెమోలో భాగంగానే లేజర్ బీకన్ ద్వారా ఇటీవల ‘తొలి కాంతి’ని భూమికి పంపించింది. ఇది కాలిఫోర్నియాలోని టేబుల్ మౌంటేన్ కేంద్రంలో నెలకొల్పిన ఆప్టికల్ కమ్యూనికేషన్ టెలిస్కోప్ లేబరేటరీకి చేరుకుంది. హయ్యర్ బ్యాండ్విడ్త్లో విస్తరణ పరిమితులు ఉన్నప్పటికీ ఇదెలా సాధ్యమైంది? అత్యంత కచ్చితమైన కేంద్రాల మూలంగానే. వ్యోమనౌకలోని ట్రాన్సీవర్, భూమ్మీది లేజర్ ట్రాన్స్మిటర్ రెండూ అత్యంత కచ్చితంగా ఎదురెదురుగా ఉండటం వల్లనే. ఒకరకంగా దీన్ని కదులుతున్న చిన్న బిళ్లను మైలు దూరం నుంచి గురిచూసి కొట్టటం లాంటిదని చెప్పుకోవచ్చు. దీన్ని సాధించటానికి వ్యోమనౌక కంపనాలకు ట్రాన్సీవర్ కదలకుండా ఏర్పాట్లు చేశారు. ఫోటాన్లు ప్రయాణిస్తుండటం వల్ల భూమి, వ్యోమనౌక స్థానాలు నిరంతరం మారిపోవటం మరో సమస్య. అందువల్ల భూమ్మీది రిసీవర్, వ్యోమనౌక ట్రాన్సీవర్ దీనికి అనుగుణంగా కుదురుకునేలా చేశారు. వ్యోమనౌక, భూమి మధ్య చాలా దూరం ఉండటం వల్ల విశాల అంతరిక్షం గుండా ప్రసారమయ్యే బలహీన లేజర్ సంకేతాల నుంచి సమాచారాన్ని సంగ్రహించటానికి కొత్త సిగ్నల్ ప్రాసెసింగ్ పరిజ్ఞానాలను వాడుతున్నారు.
భవిష్యత్ రోదసి ప్రయాణాల కోసం..
నాసాకు చెందిన లూనార్ కమ్యూనికేషన్స్ డెమాన్స్ట్రేషన్ 2013లో ఇదే పరిజ్ఞానంతో భూమి, చంద్రుడి మధ్య రికార్డు స్థాయి వేగంతో డేటాను ప్రసారం చేసింది. అయితే దీన్ని సుదూర అంతరిక్షంలోకి తీసుకెళ్లింది మాత్రం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషనే. చంద్రుడి ఆవల హయ్యర్ బ్యాండ్విడ్త్ కమ్యూనికేషన్లకు ఇది దారులు తెరిచింది. అదీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థల కన్నా ఎన్నో రెట్ల అధిక వేగంతో! మున్ముందు మనం అంతరిక్ష ప్రయాణాలకు సిద్ధమవుతున్న తరుణంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రుడి మీద, అంగారకుడి మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో కమ్యూనికేషన్ టెక్నాలజీని ఇది మరింత మెరుగుపరుస్తుంది. డీఎస్ఓసీ పంపించిన తొలి కాంతి అత్యధిక వేగంతో డేటాను ప్రసారం చేయటానికి వీలు కల్పించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా హయ్యర్ రెజల్యూషన్ ఫొటోలు, వీడియో ప్రసారాలు సాధ్యం కానున్నాయి. అంగారకుడి మీద కాలు మోపాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో గొప్ప ముందడుగు కాగలదని ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు