భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. నిజానికి చాలా ఏళ్లుగా దీనికి సహకారం అందిస్తున్నప్పటికీ తాజా నిర్ణయంతో పూర్తిస్థాయి సభ్య దేశంగా అవతరించనుంది. దీంతో శాస్త్రీయ ప్రయోజనాలను పెద్దఎత్తున వాడుకోవటానికి వీలవుతుంది. ఇంతకీ ఎస్కేఏ అంటే ఏంటి? దీని ప్రత్యేకతేంటి?
స్క్వయర్ కిలోమీటర్ అరే ఒక్క టెలిస్కోప్ కాదు. ఇది వేలాది కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్న వందలాది చిన్న రేడియో యాంటెన్నాల సముదాయం. వీటి నుంచి అందే సంకేతాలను ఎస్కేఏ క్రోడీకరించి ఒక పెద్ద రేడియో టెలిస్కోప్ మాదిరిగా పనిచేస్తుంది. అపర్చర్ సింథసిస్ ప్రక్రియ సాయంతో అత్యంత సున్నితమైన, యాంగ్యులర్ రెజల్యూషన్ చిత్రాలను సృష్టిస్తుంది. ఇది దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో రెండు వేర్వేరు రేడియో ఫ్రీక్వెన్సీల్లో పనులు నిర్వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయమైన ‘స్క్వయర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ (ఎస్కేఏఓ)’ బ్రిటన్లోని జోడ్రెల్ బ్యాంక్ అబ్జర్వేటరీలో కొలువై ఉంటుంది. ఎస్కేఏను రెండు దశల్లో నిర్మించనున్నారు. తొలిదశ రెండేళ్ల క్రితం మొదలైంది. మరో ఐదేళ్లలో వినియోగానికి అందుబాటులోకి రావొచ్చని ఆశిస్తున్నారు. మన నక్షత్ర మండలం దక్షిణార్ధ గోళం నుంచి బాగా కనిపిస్తుంది. అందువల్ల స్క్వయర్ కిలోమీటర్ అరేను ఈ ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సహకార పరిశోధన ప్రాజెక్టుల్లో ఇదొకటి. దీని నిర్మాణం పూర్తయితే అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్ కాగలదు.
16 సభ్యదేశాలు
స్క్వయర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ 2019లో మొదలైంది. ఇందులో మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, ఇటలీ సభ్యులుగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని అరే.. 350 ఎంహెచ్జెడ్ నుంచి 15.4 జీహెచ్జెడ్ మధ్యలో ఉండే మాధ్యమిక ఫ్రీక్వేన్సీ సంకేతాలను స్కాన్ చేస్తుంది. ఆస్ట్రేలియాలోని టెలిస్కోప్ దిగువ ప్రీక్వేన్సీ (50-350 ఎంహెచ్జెడ్) శ్రేణిని పరిశీలిస్తుంది. డేటా కచ్చితత్వం కోసం మున్ముందు ఆఫ్రికా దేశాల్లోనూ అదనపు డిష్లను ఏర్పాటు చేయనున్నారు. ఎస్కేఏ ప్రాంతంలో నిర్మించే టెలిస్కోప్ సదుపాయాలను ప్రికర్సర్స్ అనీ.. ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో ఉండి పరిశోధనలకు ఉపయోగపడుతున్నవాటిని పాత్ఫైండర్స్గా భావిస్తున్నారు. ఇండియా పాత్ఫైండర్ పరిశోధన భాగస్వామిగా పుణేలోని యాంట్ మెట్రివేవ్ రేడియో టెలిస్కోప్ పనిచేస్తోంది. దీన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ నిర్వహిస్తోంది. ఎస్కేఏ ఇండియా కన్సార్టియంలో దేశవ్యాప్తంగా 20కి పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో బిట్స్ పిలానీ హైదరాబాద్ కూడా పాలు పంచుకుంటోంది.
నక్షత్ర మండల పటాలు
ఎస్కేఏ సుదూర అంతరిక్షాన్ని వేగంగా వీక్షించటానికి వీలు కల్పిస్తుంది. పాలపుంతను మరింత స్పష్టంగా చూపిస్తుంది. విశ్వం అంచుల వరకూ కనిపించే నక్షత్ర మండలాలను స్పష్టమైన పటాలుగా రూపొందించటానికీ ఎస్కేఏ ఉపయోగపడుతుంది. ఇది విశ్వం ‘చీకటి యుగాల’ మీద అధ్యయనానికీ తోడ్పడుతుంది. విశ్వం ఆవిర్భావానికి మూలమైన బిగ్బ్యాంగ్ అనంతరం తొలి 3.8 లక్షల సంవత్సరాల వరకూ కాంతి ప్రకాశించటానికి వీల్లేనంత వేడి నిండి ఉండేది. అణువులు అతి బలంగా ఢీకొనటంతో అవి పారదర్శక ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోయి పొగ మంచులాంటి కాంతిని వెదజల్లాయి. ఆ సమయంలో ఏం జరిగిందనేది పెద్దగా తెలియదు. దీన్ని అవగతం చేసుకోవటానికి స్క్వయర్ కిలోమీటర్ అరే ఉపయోగపడగలదు. అంటే ఇది అందించే సమాచారంతో నక్షత్ర మండలాల ఆవిర్భావ రోజులనూ దర్శించే అవకాశముందన్నమాట. విశ్వంలో కృష్ణ పదార్థం, కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) పాత్రను అర్థం చేసుకోవటాకీ ఇది తోడ్పడుతుంది. అలాగే క్రాడిల్ ఆఫ్ లైఫ్ అనే ప్రోగ్రామ్లో భాగంగా భూమికి ఆవల జీవాన్వేషణలోనూ సాయం చేయగలదు. నివాసయోగ్య ప్రాంతాల్లో నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను గుర్తించి, అక్కడి వాతావరణంలో కర్బన రసాయన మిశ్రమాలను అధ్యయనం చేస్తుంది మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్