పల్లెకు రింగ్
తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్మెంట్) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల
111 గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర మార్గం
వచ్చే నెలలోగా భూముల గుర్తింపు పూర్తి
త్వరలో యజమానులకు నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్లే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం మార్గ ప్రణాళిక (అలైన్మెంట్) కోసం సేకరించాల్సిన భూములను గుర్తించే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఆయా జిల్లాల్లోని 111 గ్రామాల వివరాలు ‘ఈనాడు’కు లభించాయి. భూముల గుర్తింపు ప్రక్రియను వచ్చేనెల చివరి వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు స్పష్టం చేసింది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో క్షేత్రస్థాయిలో భూములను గుర్తించి గుర్తులను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 344 కిలోమీటర్ల మేరకు రెండు భాగాలుగా ప్రాంతీయ రింగు రోడ్డును కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి భూ సేకరణ చేసేందుకు వీలుగా మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖరారు చేశాయి. ఇందుకోసం 4,620 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో భూముల గుర్తింపు కోసం సర్వే ముమ్మరంగా సాగుతోంది. రింగురోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం మాత్రమే తెలిపింది. దానికి తాత్కాలిక జాతీయ రహదారి నంబరును కేటాయించాల్సి ఉంది. ట్రాఫిక్ రద్దీపై మరో దఫా అధ్యయనం చేయాలని కేంద్రం కోరింది.
సమాయత్తమవుతున్న రెవెన్యూశాఖ
ఉత్తరమార్గంలో గుర్తించిన భూముల యజమానులకు త్వరలో భూ సేకరణ నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ సమాయత్తవుతోంది. మార్గ ప్రణాళికను రూపొందించిన కె అండ్ జె ప్రాజెక్ట్ సంస్థ ఆయా గ్రామాల జాబితాను ఇప్పటికే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఆ మేరకే సర్వే నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయ్యాక రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. భూసేకరణ యత్నాలపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ ప్రక్రియ కోసం నాలుగు జిల్లాల పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని కేంద్రం సూచించింది. అందుకు సంబంధించిన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు.
ఏయే గ్రామాలంటే...
సంగారెడ్డి జిల్లా: మల్కాపూర్, గిర్మాపూర్ (కొండాపూర్ మండలం). పెద్దాపూర్(సదాశివపేట). నాగపూర్, ఇరిగిపల్లె, చింతల్పల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లె, కులబ్గూర్, (సంగారెడ్డి). కాసాల, దేవులపల్లి, హత్నూర్, దౌల్తాబాద్ (హత్నూర్). శివ్వంపేట, వెండికోల్, వెంకట కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ (చౌటకూర్).
మెదక్ జిల్లా: నాగులపల్లె, మూసాపేట, మహ్మదాబాద్, పెద్దచింతకుంట, రుస్తుంపేట, సీతారాంపూర్, మల్పర్తి, అచ్చపేట్, రెడ్డిపల్లె, చిన్నచింతకుంట, ఖాజీపేట, మంతూర్, గొల్లపల్లె, తిర్మలాపూర్, తుల్జాపూర్ (నర్సాపూర్). వెంకటాపూర్ (కౌడిపల్లె), లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతుబోగడ, గుండ్లపల్లె, కొంతాన్పల్లి (శివ్వంపేట). వట్టూరు, దండుపల్లె, నాగులపల్లె, తూప్రాన్, ఇస్లాంపూర్, దాతరపల్లె, గుండ్రెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంకటాయపల్లె, నర్సంపల్లె, మల్కాపూర్ (తూప్రాన్). మాసాయిపేట(మాసాయిపేట).
సిద్దిపేట జిల్లా: బేగంపేట, యల్కల్ (రాయిపోల్). బంగ్లా వెంటకాపూర్, మక్తామాసన్పల్లె, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, సిరిగిరిపల్లె (గజ్వేల్). మజీద్పల్లె, మెంటూర్, జబ్బాపూర్, మైలారం, కొండాయిపల్లె (వర్గల్). మర్కూక్, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి (మర్కూక్). అలీరాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె (జగ్దేవ్పూర్).
యాదాద్రి-భువనగిరి జిల్లా: గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి, వేల్పుపల్లి (తుర్కపల్లి). మల్లపూర్, దత్తాకపల్లి (యాదగిరిగుట్ట), భువనగిరి, రాయగిరి, కేసారం, పెంచికలపహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, ఎర్రంబల్లి, నందనం (భువనగిరి). పహిల్వాన్పూర్, కంచనపల్లె, టేకులసోమారం, రెడ్లరేపాక, ప్రొద్దుటూర్, వర్కూట్పల్లె, గోకారం, వలిగొండ (వలిగొండ). నేలపట్ల, చిన్నకొండూర్, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, చౌటుప్పల్, లింగోజిగూడ, పంతంగి, తంగడ్పల్లి (చౌటుప్పల్).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు