Padma Awards: వేడుకగా ‘పద్మాల’ ప్రదానం
దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 141 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020 ఏడాదికి సంబంధించిన పద్మ పురస్కారాలను సోమవారం ప్రదానం చేశారు. వాస్తవానికి గతేడాదే...
141 మందికి పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
పద్మభూషణ్ అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ముంతాజ్అలీ
పద్మశ్రీలు స్వీకరించిన నలుగురు తెలుగువారు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న పీవీ సింధు
దిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 141 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020 ఏడాదికి సంబంధించిన పద్మ పురస్కారాలను సోమవారం ప్రదానం చేశారు. వాస్తవానికి గతేడాదే ఈ అవార్డులను అందజేయాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి ఉద్ధృతి కారణంగా వీలు కాలేదు. మరోవైపు, మరణానంతరం కొందరు అవార్డుకు ఎంపికవగా, వారి తరఫున కుటుంబసభ్యులు పురస్కారాలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ముంతాజ్అలీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. మరో నలుగురు పద్మశ్రీలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా తదితరులు హాజరయ్యారు. 141 మందిలో ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మ భూషణ్, 118 మంది పద్మశ్రీ అందుకున్నారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న చింతల వెంకట్రెడ్డి
* కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, జార్జ్ ఫెర్నాండెజ్లకు మరణానంతరం పద్మవిభూషణ్ లభించిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ తరఫున ఆయన సతీమణి సంగీత జైట్లీ, సుష్మాస్వరాజ్ తరఫున ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్, జార్జ్ ఫెర్నాండెజ్ తరఫున ఆయన భార్య లీలా కబీర్లు ప్రథమ పౌరుడి నుంచి పురస్కారాలు స్వీకరించారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న శ్రీభాష్యం విజయసారథి
* ఆధ్యాత్మిక రంగంలో సేవలందించినందుకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు (78) పద్మశ్రీ స్వీకరించారు. ఏపీకే చెందిన యడ్ల గోపాలరావు (కళలు), తెలంగాణకు చెందిన రైతు చింతల వెంకట్రెడ్డి, సంస్కృత కవి శ్రీభాష్యం విజయసారథిలు పద్మశ్రీ అందుకున్నారు.
స్ఫూర్తి పొందండి: నరేంద్ర మోదీ
పద్మ పురస్కార గ్రహీతల్లో సామాన్యులూ ఉండడం సంతోషం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘పర్యావరణం నుంచి వ్యాపార రంగం వరకు, వ్యవసాయం నుంచి కళల వరకు, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి సామాజిక సేవ వరకు, ప్రభుత్వ పాలన నుంచి సినిమా రంగం వరకు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వారి గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందండి’’ అని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
ప్రైవేటులో రుసుములపై త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రాణాలు తీసిన పెద్దపులిని పట్టేశారు
మహారాష్ట్రలోని బల్లార్ష-కార్వా అటవీ ప్రాంతంలో నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన టి-86 అనే పెద్దపులిని ఎట్టకేలకు అటవీ అధికారులు సోమవారం రాత్రి పట్టుకుని చంద్రపూర్కు తరలించారు. -
రచయితలపై దాడుల విషయంలో ప్రభుత్వం మౌనం సరికాదు
కాకతీయ యూనివర్సిటీలో సమూహ కవులు, రచయితలపై ఏబీవీపీ జరిపిన భౌతిక దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం అరాచక శక్తులకు ఆజ్యం పోస్తోందని తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక మండిపడింది. -
నామినేషన్ల తిరస్కరణపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి దాఖలైన నామినేషన్ల తిరస్కరణపై జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. -
కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణపై ఏపీ దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతోపాటు వాటి అవుట్లెట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వాటిని కృష్ణా ట్రైబ్యునల్-1 తీర్పు ప్రకారం నిర్వహించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. -
బాబూజీ స్మారక నాణెం విడుదల
బాబూజీ మహరాజ్ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
మే 6 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
మే 6 నుంచి 31వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేడు కర్ణాటకకు ఇంజినీర్ల బృందం
రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని కోరనుంది. -
సంక్షిప్త వార్తలు
నీటిపారుదలశాఖలో మంగళవారం పది మంది ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ గడ్డం శ్రీనివాస్ ఈ జాబితాలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర