సంక్షిప్త వార్తలు (8)
నీటిపారుదలశాఖలో మంగళవారం పది మంది ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ గడ్డం శ్రీనివాస్ ఈ జాబితాలో ఉన్నారు.
పది మంది ఇంజినీర్ల పదవీ విరమణ
ఈనాడు, హైదరాబాద్: నీటిపారుదలశాఖలో మంగళవారం పది మంది ఇంజినీర్లు పదవీ విరమణ పొందారు. మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ గడ్డం శ్రీనివాస్ ఈ జాబితాలో ఉన్నారు. అలాగే ఎస్ఈలు సి.శ్రీనివాస్, శ్రీధర్రావు దేశ్పాండే, ఎన్.రమేశ్, కె.ఎన్.ఆనంద్, సుశీల్కుమార్ దేశ్పాండే, ఈఈలు ఎ.సూర్యనారాయణరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎ.ఉదయ్కుమార్, బి.సంజీవరావులు పదవీ విరమణ పొందగా తోటి అధికారులు, సిబ్బంది వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
మెరిసిన నారాయణ విద్యార్థులు
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్స్ విద్యార్థులు.. ప్రతి ఏడుగురిలో ఒకరు, మొత్తం 12.5 శాతం మంది పది జీపీఏ సాధించినట్లు విద్యాసంస్థల ఎండీలు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. 1707 మంది విద్యార్థులు 9.5 జీపీఏ, ఆ పైన సాధించినట్లు వెల్లడించారు. అన్ని సబ్జెక్టుల్లో 32,135 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ పాయింట్లు (91-100 మార్కులు) పొందారని పేర్కొన్నారు. ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 99.3 శాతంగా ఉందన్నారు. నారాయణలో చదివిన ప్రతి విద్యార్థి సగటున 9.1 జీపీఏ సాధించినట్లు వెల్లడించారు.
సత్తా చాటిన శ్రీచైతన్య
పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్స్ విద్యార్థులు 1402 మంది పది జీపీఏ సాధించారని డైరెక్టర్ సీమ తెలిపారు. బోర్డు ప్రకటించిన ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన మొత్తం విద్యార్థుల్లో 16% శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులేనని వెల్లడించారు. 5,207 మంది విద్యార్థులు 9.5, ఆపైన జీపీఏ సాధించారని పేర్కొన్నారు. తమ విద్యార్థులు సగటున 9.2 జీపీఏ పొందారని, 99.2 శాతం మంది పాసయ్యారని వివరించారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో 17,913 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారని చెప్పారు. విద్యార్థులను అభినందించారు.
భాష్యం విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు 264 మంది పది జీపీఏ సాధించారని హైదరాబాద్ భాష్యం జోనల్ హెడ్ అంకమ్మరావు తెలిపారు. 502 మంది 9.8, ఆ పైన జీపీఏ, 717 మంది 9.7, ఆ పైన జీపీఏ, 1492 మంది 9కిపైన జీపీఏ సాధించారని వెల్లడించారు. తమ విద్యార్థులు మొత్తం 11,201 ఏ గ్రేడ్లు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు.
కేశవరెడ్డిలో ఉత్తమ ఫలితాలు
పదో తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక శాతం పది జీపీఏ సాధించారని ఫౌండర్ ఛైర్మన్ కేశవరెడ్డి తెలిపారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు 9.8, 9.7, 9.5 జీపీఏలను సాధించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు 9.0 జీపీఏ, ఆపైన సాధించారని వెల్లడించారు. అన్ని సబ్జెక్టులలో సగటు జీపీఏ 8కి పైగా ఉందని, సగటున 54 శాతం ఏ1, ఏ2 గ్రేడ్లు పొందినట్లు వివరించారు.
అల్ఫోర్స్ జయకేతనం
పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు 135 మంది పది జీపీఏ సాధించారని విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి తెలిపారు. 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు. 1140 మంది విద్యార్థులకు గానూ 747 మంది విద్యార్థులు 9 జీపీఏ, ఆపై మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను అభినందించారు.
ఎస్ఆర్ స్కూల్స్ మెరుపులు
పదో తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు 124 మంది పది జీపీఏ సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరణలోకి తెస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు.
గురుకుల విద్యార్థుల ప్రతిభ
రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో 98.25 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. 153 గురుకులాల్లో నూరుశాతం ఉత్తీర్ణత నమోదైందని, 391 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని పేర్కొన్నారు.
- గిరిజన గురుకులాల్లో పదో తరగతిలో 97.3 శాతం ఉత్తీర్ణత నమోదైందని గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్రెడ్డి తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 89.64 శాతం, వసతి గృహాల్లో 90.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.
- ఎస్సీ గురుకుల సొసైటీలో పదిలో 98.06 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో 122 గురుకులాలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయని, 187 మంది విద్యార్థులు పది జీపీఏ తెచ్చుకున్నారని వివరించారు.
- తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు 89 మంది పది జీపీఏ సాధించారని విద్యాసంస్థ (టీఎస్ఆర్ఈఎస్) కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. మిగిలిన గురుకులాల కంటే తమ సంస్థ విద్యార్థులు అత్యధిక ఫలితాలు సాధించారని వెల్లడించారు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త రూపంలో తెలంగాణ రేషన్ కార్డులు?
ప్రస్తుతం ఉన్న రేషన్ (ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. -
జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ రుసుములు
జూన్ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు పెరగనున్నాయి. -
అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. -
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడాలి
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా విధానాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్దేశించారు. -
జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ ఆవిష్కరణ
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. -
భారత్-అమెరికా భాగస్వామ్యం.. ప్రపంచానికి భాగ్యదాయకం
భారత్-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
ఇదీ సంగతి!
-
రైస్మిల్లు వద్ద 5 రోజులుగా పడిగాపులు
రోజుల తరబడి రైస్మిల్లుల్లో ధాన్యం దించకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నామని, తగిన న్యాయం చేయాలంటూ రైతులు, కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్ 23 నుంచి
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
నైనీ బ్లాకులో తవ్వకాలకు తొలగిన అడ్డంకులు
ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ మరో నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉంది. -
కాచిగూడ-రాయచూరు రైళ్లు 10 రోజులు రద్దు
కాచిగూడ-రాయచూరు, రాయచూరు-కాచిగూడ డెమూ రైళ్ల (నం.07477/07478)ను ఈ నెల 21 నుంచి 30 వరకు ద.మ.రైల్వేరద్దు చేసింది. -
13 నెలల్లో 30,049 ఫోన్ల రికవరీ
బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు మెరుగైన పనితీరును కనబరుస్తూనే ఉన్నారు. -
వైభవం.. నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. -
ఆ ఫైనాన్స్ సంస్థతో టెస్కాబ్కు సంబంధం లేదు
శ్రీప్రియాంక ఫైనాన్స్ సంస్థతో కానీ, దాని ఖాతాదారులతో కానీ తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టెస్కాబ్)కు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్ ఎండీ మురళీధర్ తెలిపారు. -
మూడు నెలల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి
మత్స్యకార సంఘాల్లో సభ్యత్వానికి కొన్ని తెగలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మరికొన్నింటిని తాజాగా చేర్చడం తదితర వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. -
ఎంజీఎంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు అయిదు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. -
కిర్గిజ్స్థాన్ నుంచి విద్యార్థులను రప్పించాలని కిషన్రెడ్డి లేఖ
కిర్గిజ్స్థాన్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి లేఖరాశారు. -
పెద్దలకు బీసీజీ టీకా
క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది. -
సంక్షిప్త వార్తలు (4)
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. -
ఈ వానాకాలం ఆశాజనకమే!
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ఆశాజనకంగా ఉంటుందని, నిరుటి కంటే అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది.