BJP Meeting: అయిదు రాష్ట్రాల్లోనూ మనదే గెలుపు
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలతో మమేకం కండి
నమ్మకమైన వారధిలా పనిచేయండి
భాజపా జాతీయ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం
ప్రధానిని ప్రశంసిస్తూ కార్యవర్గం తీర్మానం
ప్రధాని మోదీని సత్కరిస్తున్న పార్టీ నేతలు జేపీ నడ్డా, పీయూష్ గోయల్. పక్కన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్
ఈనాడు, దిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దిల్లీలో జరిగిన భాజపా జాతీయ కార్యనిర్వాహక వర్గం సమావేశం ముగింపు సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు-పార్టీకి మధ్య నమ్మకమైన వారధిలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉందంటే దానికి కారణం... ప్రజలతో కలిసి పనిచేయడమేనని చెప్పారు. సేవ, సంకల్పం, నిబద్ధత అనే విలువలపై ఆధారపడి భాజపా పనిచేస్తోందని, మిగతా పార్టీల్లా కుటుంబం చుట్టూ తిరగదని పరోక్షంగా కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కొవిడ్ మహమ్మారి సమయంలో దేశాన్ని ప్రధాని నడిపించిన తీరును భాజపా జాతీయ కార్యవర్గం ప్రశంసించింది. 100 కోట్ల టీకాలు దాటడం, 80 కోట్ల ప్రజలకు ఉచితంగా ఆహారం అందించడం.. తదితర అంశాలు ప్రధాని నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని అభిప్రాయపడింది. మోదీని, ఇటీవల భాజపా సాధించిన విజయాలను పొందుపరుస్తూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మద్దతుగా పలువురు ప్రసంగించారు. ఈ తీర్మానం ప్రతిపక్షాలపైనా విమర్శలు చేసింది. కరోనా సమయంలో అవకాశవాద రాజకీయాలకు విపక్షాలు పాల్పడ్డాయని, ట్విటర్ ద్వారా అపోహలు రేకెత్తించే ప్రయత్నం చేశాయని ఆరోపించింది. బెంగాల్లో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న హింసపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భాజపా ప్రదర్శనను ఈ తీర్మానం శ్లాఘించింది. కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీ‡యూష్ గోయల్, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్..ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భాజపా సీనియర్ నేతలు ఎల్.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల్లోని పార్టీ నేతలు వర్చువల్గా హాజరయ్యారు.
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా
గజమాలతో మోదీకి సన్మానం
జాతీయ కార్యనిర్వాహక వర్గం మోదీని గజమాలతో సత్కరించింది. కొవిడ్ మహమ్మారి సమయంలో దేశాన్ని ప్రధాని నడిపించిన తీరును నేతలు కొనియాడారు. అంతకుముందు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేస్తూ.. పశ్చిమ బెంగాల్లో పార్టీ అద్భుత విజయాలు సాధించిందని అన్నారు. సమకాలీన భారత రాజకీయాల్లో ఈ స్థాయిలో ఓ రాజకీయ పార్టీ ఎదగడం అరుదని పేర్కొన్నారు. భాజపా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రావాల్సి ఉందని అన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశాల్లో కూడా భాజపా విస్తరిస్తోందని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సిక్కు ఓటర్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సేవలను కూడా నడ్డా ప్రస్తావించారు. రూ.120 కోట్లతో కర్తార్సింగ్ నడవాను ప్రభుత్వం పూర్తి చేసిందని, 1984 నాటి అల్లర్లపై దర్యాప్తును కూడా కేంద్రం వేగవంతం చేసిందని పేర్కొన్నారు.
చర్చ.. ఎన్నికల రాష్ట్రాలపైనే..
జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల(ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, మణిపుర్, గోవా, ఉత్తరాఖండ్) ఎన్నికలపైనే చర్చ జరిగింది. ఈ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ, ఇతర సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేశారు. కొవిడ్, జమ్మూకశ్మీర్ పరిస్థితి.. తదితర అంశాలపైనా చర్చ జరిగింది. పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష జరిపారు. ఈ ఏడాది డిసెంబర్ 25కల్లా దేశవ్యాప్తంగా ఉన్న 10.40 లక్షల పోలింగ్ కేంద్రాల్లో బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. ఓటర్ల జాబితాలోని పేజీకో వ్యక్తిని బాధ్యుడిగా నియమిస్తూ గుజరాత్లో చేసిన ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. బూత్కమిటీ స్థాయిలో మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం వినేలా చర్యల చేపట్టాలని నాయకులు తీర్మానించారు. త్వరలో శాసనసభ ఎన్నికలకు వెళుతున్న ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంజాబ్ పార్టీ అధ్యక్షుడు ఈ సందర్భంగా తమ నివేదికలు సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ