నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్‌కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది.

Published : 06 May 2024 03:11 IST

మద్దూరు, న్యూస్‌టుడే: నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్‌కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. దీన్ని ఆదివారం గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రెండు రోజుల క్రితం మరణించి ఉంటుందని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వివరాలు తెలుస్తాయని అటవీశాఖ సెక్షన్‌ అధికారి లక్ష్మణ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని