6 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రతిపాదన
ఆరు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు.. తెరాస ఎంపీ కేఆర్ సురేష్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకేసింగ్ తెలిపారు. ఇందులో...
ఈనాడు, దిల్లీ: ఆరు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు.. తెరాస ఎంపీ కేఆర్ సురేష్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకేసింగ్ తెలిపారు. ఇందులో 1. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, 2. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ, 3. మహబూబ్నగర్లో మూడు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు, 4. వరంగల్ జిల్లా మామ్నూరు, 5. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, 6. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టులు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ పూర్తిచేసి తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తి అన్నది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది డిసెంబరుకు హైదరాబాద్ ఎయిర్పోర్టు విస్తరణ పూర్తి
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని పౌరవిమానయానశాఖ సహాయ మంత్రి జనరల్ వీకేసింగ్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ పూర్తయ్యాక విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 1.2 కోట్ల స్థాయి నుంచి 3.4 కోట్లకు చేరుతుందన్నారు.
రాష్ట్రంలోని స్మార్ట్ సిటీల్లో రూ.752 కోట్ల పనులు పూర్తి
తెలంగాణ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కింద ఎంపికైన గ్రేటర్ వరంగల్, కరీంనగర్లలో ఇప్పటివరకు రూ.752.09 కోట్ల విలువైన 27 పనులు పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో తెరాస సభ్యుడు బండ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఆ రెండు నగరాల్లో రూ.3,720.14 కోట్ల విలువైన 162 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. గత నవంబరు 12 వరకు కేంద్రం ఈ రెండు నగరాలకు రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసిందన్నారు.
గిరిజన వర్సిటీకి భూకేటాయింపులో జాప్యం
తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు లోక్సభలో తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో ఈ వర్సిటీ ఏర్పాటుకు డీపీఆర్ తయారీ పూర్తయిందని, ఆర్థిక అనుమతులు రావాల్సి ఉందని వివరించారు.
రూ.900 కోట్లు అడిగితే రూ.450 కోట్లు విడుదల చేశాం
తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.900 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు మార్చి 31న రూ.450 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌదరి లోక్సభలో తెలిపారు. తెరాస ఎంపీ నామా నాగేశ్వర్రావు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
కేంద్రీయ విద్యాలయ ఆన్లైన్ క్లాస్లకు 50% మంది హాజరు
తెలంగాణలోని 35 కేంద్రీయ విద్యాలయాల ఆన్లైన్ క్లాస్లకు దాదాపు 50% మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ లోక్సభలో తెలిపారు. మిగిలిన 50% మంది దశలవారీగా ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
వలస కార్మికులకు రూ.330 కోట్ల సాయం
కరోనా సమయంలో తెలంగాణలోని వలస కార్మికుల కోసం రూ.330 కోట్ల సాయంచేసినట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్తేలి లోక్సభలో తెలిపారు. ఎంపీ సంజయ్ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
ఈ-శ్రమ్ పోర్టల్లో రాష్ట్రం నుంచి 6లక్షలమంది నమోదు
అసంఘటిత కార్మికుల వివరాల నమోదుకోసం కేంద్ర కార్మికశాఖ ఏర్పాటుచేసిన ఈ-శ్రమ్ పోర్టల్లో ఇప్పటివరకు 8.97 కోట్లమంది పేర్లు నమోదుచేసుకున్నట్లు ఆ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. సోమవారం లోక్సభలో ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 14,91,161 మంది, తెలంగాణ నుంచి 6,53,210 మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం సంఖ్యలో ఏపీ 13, తెలంగాణ 17వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ