రూ.1.30 లక్షల కోట్లను దాటిన జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ వసూళ్లు వరుసగా 5వ నెల రూ.లక్ష కోట్లను, వరుసగా రెండో నెల రూ.1.30 లక్షల కోట్లను దాటాయి. నవంబరులో రూ.1,31,526 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది గత ఏడాది
తెలంగాణలో 24%, ఏపీలో 10% వృద్ధి నమోదు
ఈనాడు, దిల్లీ: జీఎస్టీ వసూళ్లు వరుసగా 5వ నెల రూ.లక్ష కోట్లను, వరుసగా రెండో నెల రూ.1.30 లక్షల కోట్లను దాటాయి. నవంబరులో రూ.1,31,526 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది గత ఏడాది నవంబరుతో పోలిస్తే 25.30% అధికమని తెలిపింది. జీఎస్టీ మొదలైన నాటినుంచి ఇప్పటివరకూ ఈ ఏడు ఏప్రిల్లో అత్యధికంగా రూ.1,39,708 కోట్లు వసూలైందని, తర్వాత ఇది రెండో అత్యధికమని వెల్లడించింది. ‘‘రిటర్న్లు దాఖలుచేయని వారికి ఈ-వేబిల్లుల జారీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిలిపేయడంతో గత కొన్ని నెలలుగా దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరిగి, వసూళ్లు మెరుగుపడ్డాయి’’ అని ఆర్థిక శాఖ విశ్లేషించింది. గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో జీఎస్టీ వసూళ్లు తెలంగాణలో 24%, ఆంధ్రప్రదేశ్లో 10% వృద్ధి చెందాయి. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి సగటున 20% వృద్ధి నమోదుకాగా, తెలంగాణలో అంతకంటే ఎక్కువ నమోదైంది.
రాష్ట్రాలు భూమి ఇస్తేనే నవోదయ విద్యాలయాలు
రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా భూమి ఇవ్వడానికి సుముఖత చూపితేనే కొత్తగా నవోదయ విద్యాలయాలు మంజూరుచేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ తెలిపారు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఈ పాఠశాలల ఏర్పాటు గురించి తెరాస ఎంపీ కేఆర్ సురేష్రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘కొత్త పాఠశాలల ఏర్పాటు నిరంతర ప్రక్రియ. భవనాల నిర్మాణానికి అవసరమైన భూమిని ఉచితంగా ఇవ్వడానికి, నిర్మాణం పూర్తయ్యేంతవరకూ అద్దెలేని భవనాలు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపే అంగీకారంపై కొత్తవి మంజూరుచేయడం ఆధారపడి ఉంటుంది’’ అని వివరించారు.
ఫాస్టాగ్ అనంతరం పెరిగిన టోల్ వసూళ్లు: కేంద్ర మంత్రి గడ్కరీ
ఫాస్టాగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత జాతీయ రహదారుల్లో టోల్ వసూళ్లలో పెరుగుదల కనిపించినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ విధానం మొదలైందని, ఆ రోజు నుంచి ఫిబ్రవరి 28వ తేదీ నాటికి రోజుకు రూ.104 కోట్ల టోల్ వసూలైనట్లు చెప్పారు. 2020 ఫిబ్రవరిలో ఇదే సమయంలో రోజుకు కేవలం రూ.80 కోట్లే లభ్యమైనట్టు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో తెరాస ప్రభుత్వం విఫలం: ఉత్తమ్
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. లోక్సభ జీరో ఆవర్లో బుధవారం ఆయన మాట్లాడారు. మార్కెట్కు వచ్చిన వానా కాలం పంటను మొత్తం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. యాసంగి పంట వేసేందుకు ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో ఆందోళన చేస్తున్న తెరాస ఎంపీలు వెనక్కు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని తమ ముఖ్యమంత్రికి చెప్పాలని సూచించారు. ఆ సమయంలో తెరాస సభ్యులు గట్టిగా నినాదాలు చేస్తుండడంతో సభాపతి మరొకరికి అవకాశం ఇచ్చారు.
కరోనా పరీక్షల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా వసూళ్లు: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల దగ్గర ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు ఉన్నా, యాంటిజెన్ టెస్ట్ పేరిట ప్రైవేటు సంస్థలు రూ.4,500 వసూలు చేస్తున్నాయన్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు. -
దూరవిద్య బలోపేతానికి ప్రభుత్వాలు సహకరించాలి
దూరవిద్య బలోపేతం చేయడంతో పాటు, ఆధునికీకరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఓయూలో నిర్వహించిన జాతీయ సదస్సులో వక్తలు విజ్ఞప్తి చేశారు. -
రూ.104 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర పోలీసుశాఖ రూ.104.18 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
గురుకుల డిగ్రీ పరీక్షకు 87.79% హాజరు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరం సీట్ల భర్తీకీ ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79 శాతం విద్యార్థులు హాజరైనట్లు టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్ సైదులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!