TS News:లంచం ఇస్తే.. ఎవరికైనా రిజిస్ట్రేషన్‌!

‘మీకు లంచం ఎవరిస్తే వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తారు కదా?’ అని ఓ యువకుడు ప్రశ్నించగా.. ‘అంతే అంతే’ అంటూ ఓ తహసీల్దార్‌ ఫోన్‌.....

Updated : 11 Jan 2022 08:02 IST

యువకుడితో తహసీల్దారు ఫోన్‌ సంభాషణ

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: ‘మీకు లంచం ఎవరిస్తే వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తారు కదా?’ అని ఓ యువకుడు ప్రశ్నించగా.. ‘అంతే అంతే’ అంటూ ఓ తహసీల్దార్‌ ఫోన్‌ సంభాషణలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరల్‌గా మారాయి. మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ తహసీల్దార్‌గా పనిచేసి గత శనివారం బదిలీపై వెళ్లిన దశరథ్‌తో మండలంలోని పోచమ్మరాల్‌కు చెందిన ఓ యువకుడు గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగిందంటూ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ సంభాషణ చోటుచేసుకుంది.

యువకుడు: పోచమ్మరాల్‌ గ్రామంలో ఈ నెల 6న పీర్యా పేరిట ఉన్న భూములను కొందరు రైతులు తమ పేరిట మార్చుకున్నారు. అసలు ఆ పీర్యా పేరిట భూమే లేదు. ఆయన భార్య డిప్యూటీ తహసీల్దారు అయినంత మాత్రాన అతడి పేరిట భూమి ఎలా వచ్చింది? గుంటకు రూ.1500 లంచం తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేయడం ఎంతవరకు కరెక్ట్‌ సార్‌?
తహసీల్దారు: రూ.1500 నాకిచ్చిండ్రా?

యువకుడు: మీక్కాదు సార్‌, ఇక్కడ సాక్షులు ఉన్నారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చిండ్రో చెబుతున్నారు. అందులో ఎంతమంది పట్టా చేయించుకున్నారో మొత్తం తీపించిన. ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేస్తా. (ఇలా అంటుండగానే..)
తహసీల్దారు: సీఎంకు ఇవ్వు.. జర మంచిగుంటది. ఇక ఎవరు చేయరిక ఇట్ల.. (వ్యంగ్యంగా)

యువకుడు: మీరు లంచం ఎవరిస్తే వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తారు.. ఎవరు ఎక్కువ ఇస్తే వారి మీదకు మారుస్తారు కదా?
తహసీల్దారు: అంతే అంతే నువ్విస్తే నీ పేరిటకు మారుస్తం.. అంటూ సంభాషణ సాగింది.

దీనిపై తహసీల్దారు దశరథ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పొరపాటు జరిగిందని, పనిలో బిజీగా ఉండి అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని