ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, నిరంజన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణలకు చెందిన ఇద్దరేసి అభ్యర్థులను ఎంపిక చేసింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు
విజయసాయిరెడ్డికి మరోసారి, కొత్తగా బీద మస్తాన్రావుకు చోటు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణలకు చెందిన ఇద్దరేసి అభ్యర్థులను ఎంపిక చేసింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డికి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. ఏపీలో ఇప్పటికే ఎంపీగా ఉంటూ వచ్చే నెలలో పదవీ కాలం ముగియనున్న విజయసాయిరెడ్డికి మరో అవకాశం ఇచ్చారు. మిగిలిన ఒక్క స్థానాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్రావుకు కేటాయించారు.
న్యాయవాది నిరంజన్రెడ్డికి..
తొలిసారి 2017లో రాజ్యసభకు అభ్యర్థిని పంపే అవకాశం వైకాపాకు దక్కింది. ఆ తొలి అవకాశాన్ని సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డికి ఇచ్చారు. ఆయన వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. జగన్ కేసులను వాదిస్తున్న న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డికి రాజ్యసభ టికెట్ కేటాయించారు. ఆయన తెలంగాణలోని నిర్మల్కు సమీపంలోని దిలావర్పూర్ మండలం సిర్గాపూర్కు చెందినవారు.
రాజ్యసభకు వైకాపా ఎంపిక చేసిన ఇద్దరు బీసీ అభ్యర్థులు కృష్ణయ్య, బీద మస్తాన్రావు రాజకీయ ప్రస్థానం తెదేపాలోనే ప్రారంభమైంది. ఒకసారి కావలిలో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మస్తాన్రావు.. 2019లో నెల్లూరు లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అదే సంవత్సరం డిసెంబరులో ఆయన వైకాపాలో చేరారు. కృష్ణయ్య 2014లో హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో తెలంగాణ తెదేపా సీఎం అభ్యర్థిగా కృష్ణయ్యను ప్రకటించారు.
నెల్లూరు నుంచే ముగ్గురు
నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, విజయసాయిరెడ్డి వైకాపా నుంచి ఇప్పటికే రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన బీద మస్తాన్రావుకూ అవకాశం దక్కింది. దీంతో నెల్లూరు జిల్లా నుంచే ముగ్గురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లవుతోంది.
జాతీయ గుర్తింపు ఉన్న నేత అనే...
నాలుగు స్థానాల్లో తొలుత ఒక స్థానాన్ని బీసీలకు, మరొకటి ఎస్సీ/మైనారిటీ వర్గాలకు కేటాయించాలని భావించినా.. చివర్లో బీసీ వర్గానికే మరో సీటు ఇవ్వాలనే నిర్ణయానికి వైకాపా అధినాయకత్వం వచ్చినట్లు తెలిసింది. జనవరిలోనే బీద మస్తాన్రావు పేరును ఖరారు చేశారు. అయితే ‘ఆయనకే కాకుండా మరో స్థానాన్నీ బీసీలకు ఇస్తే 50% బీసీలకు ఇచ్చినట్లవుతుంది. 2020లో 4 స్థానాలు పార్టీకి వస్తే అందులో 50% బీసీలకు ఇచ్చాం.. ఇప్పుడూ అలాగే ఇచ్చినట్లు ప్రజల్లోకి సందేశాన్ని పంపినట్లవుతుంది’ అనే కోణంలో కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి నుంచి బీసీ సంక్షేమ సంఘం నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆర్.కృష్ణయ్య పేరును పరిశీలించారు. ఆయన తెలంగాణకు చెందినవారే అయినా బీసీల నేతగా పేరుండటంతో అందరి ఆమోదం పొందుతారని వైకాపా అధినాయకత్వం అంచనా వేసిందంటున్నారు. సీఎంవో నుంచి సోమవారం కృష్ణయ్యకు ఫోన్ చేసి.. మంగళవారం విజయవాడ రావాలని చెప్పారు. అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు సీఎం జగన్తో కృష్ణయ్య భేటీ అయ్యారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. శాలువాతో సత్కరించారు.
బలహీనవర్గాలకు సముచిత స్థానం ఇచ్చేందుకే
‘బలహీనవర్గాలకు సముచిత స్థానం కల్పించి, వారిని రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఆలోచనలో భాగంగా ముఖ్యమంత్రి ఇప్పుడు బీసీలైన కృష్ణయ్య, మస్తాన్రావును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు’ అని మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ తదితరులతో ముఖ్యమంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తర్వాత రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. పేర్లను ప్రకటించారు. కృష్ణయ్య బీసీల్లో జాతీయ స్థాయి నాయకుడు కాబట్టే పార్టీపరంగా బీసీల వాణిని వినిపించేందుకే ఆయన్ను ఎంపిక చేశారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిరంజన్రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది అని.. అందువల్లే ఆయనను ఎంపిక చేశారని బొత్స తెలిపారు.
సిర్గాపూర్ నిరంజన్రెడ్డి
పుట్టిన తేదీ: 1970 జులై 23
స్వగ్రామం: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్
తల్లిదండ్రులు: విద్యాసాగర్రెడ్డి (సీనియర్ న్యాయవాది), విజయలక్ష్మి
కుటుంబం: భార్య, కుమారుడు, కుమార్తె
విద్యాభ్యాసం: పుణెలోని సింబియాసిస్ లా స్కూల్లో న్యాయవిద్య.
వృత్తి జీవితం: 1992లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదులు మనోహర్రెడ్డి, ప్రతాప్రెడ్డివద్ద ప్రాక్టీసు ప్రారంభించారు. రాజ్యాంగపరమైన అంశాలు, చట్టాలపై పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఎన్నికల సంఘం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సెల్గా పలు కేసుల్లో సేవలందించారు.
చిత్ర నిర్మాత: ఆచార్య, వైల్డ్డాగ్, అర్జున ఫల్గుణ, మిషన్ ఇంపాజిబుల్ తదితర చిత్రాలకు..
ర్యాగ కృష్ణయ్య
పుట్టిన తేదీ: 1954 సెప్టెంబరు 13
స్వగ్రామం: వికారాబాద్ మోమిన్పేట మండలం రాళ్లడుగుపల్లి
విద్యాభ్యాసం: ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం
ఉద్యమాలు: 1987లో ఉమ్మడి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రారంభించారు. వసతి గృహాలు, బోధన రుసుములు, ఉపకార వేతనాల సమస్యలు, ఖాళీల భర్తీలు, నిరుద్యోగులకు వయోపరిమితి పెంపు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఆందోళనలు చేశారు. 2014 నుంచి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు.
రాజకీయాలు: 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడారు. ఇప్పుడు ఏ పార్టీలో లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ