Virtual Lab: ల్యాబ్ లేకున్నా ప్ర‘యోగం’!
ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ.. ఇలా ఏ కోర్సు చేసినా ప్రాక్టికల్స్ తప్పనిసరి. కానీ ప్రస్తుతం చాలా కళాశాలల్లో ప్రయోగశాలలు అందుబాటులో లేవు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ఈ సమస్య ఎక్కువ. దీన్ని అధిగమించేలా
వర్చువల్, రిమోట్ ల్యాబ్లతో వీలు
బిట్స్, ట్రిపుల్ ఐటీలో ప్రత్యేకంగా ఏర్పాటు
ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు అందుబాటులో తెచ్చేలా కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ.. ఇలా ఏ కోర్సు చేసినా ప్రాక్టికల్స్ తప్పనిసరి. కానీ ప్రస్తుతం చాలా కళాశాలల్లో ప్రయోగశాలలు అందుబాటులో లేవు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ఈ సమస్య ఎక్కువ. దీన్ని అధిగమించేలా వర్చువల్, రిమోట్ ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఇప్పటికే బిట్స్ పిలానీ-హైదరాబాద్, ట్రిపుల్ఐటీ హైదరాబాద్లో నడుస్తుండగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ఏమిటీ విధానం?
విద్యార్థులు నేరుగా ప్రయోగశాలలకు వెళ్లనక్కర్లేదు. తమ కళాశాలలో ఉంటూనే.. వేరొక కళాశాలలో ఉండే పరికరాలతో ప్రయోగాలు చేయొచ్చు. బిట్స్లో రిమోట్, వర్చువల్ ల్యాబ్ ఉండగా.. ట్రిపుల్ఐటీలో వర్చువల్ ల్యాబ్ ఉంది. వర్చువల్ ల్యాబ్లో సాఫ్ట్వేర్ ఆధారిత ప్రయోగాలు చేసేందుకు వీలుండగా, రిమోట్ ల్యాబ్లలో పరికరాలను కూడా ఉపయోగించవచ్చు. బిట్స్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (డబ్ల్యూఐఎల్పీ)లో విద్యార్థులు, వృత్తి నిపుణులు తమ శిక్షణలో భాగంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కేంద్రంలో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ సహా సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ చేస్తూ వర్చువల్, రిమోట్ ల్యాబ్ సాయంతో ప్రయోగాలు చేసే వీలుంటుందని బిట్స్ డబ్ల్యూఐఎల్పీ డీన్ గురునారాయణన్ వివరించారు. ఐటీ, ఆటోమోటివ్, తయారీ, ఫార్మా, కెమికల్స్ రంగాలకు చెందిన లక్ష మందికిపైగా వృత్తి నిపుణులు ఆయా కోర్సులు చేసినట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలోనూ 2012 వర్చువల్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీలకు చెందిన వెయ్యికి పైగా ప్రయోగాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ట్రిపుల్ఐటీకి రాకుండానే చేసి ఇంటర్న్షిప్లు పూర్తి చేసేందుకు వీలు కలుగుతోంది.
అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు
-సి.శ్రీనాథ్, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి
బిట్స్లో ఉన్న వర్చువల్, రిమోట్ ల్యాబ్ల నుంచి సహకారం తీసుకుందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఆయా ల్యాబ్లలోని ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి.
ఎలా చేస్తారంటే..?
ఈ ల్యాబ్లు సెన్సర్, రిమోట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. కళాశాలలోని ల్యాబ్లో అందుబాటులో ఉన్న పరికరాలకు సెన్సర్లు, సీసీ కెమెరాలు అమర్చి వర్చువల్గా ఆపరేట్ చేసేలా సిద్ధం చేస్తారు. వేరొక కళాశాలలో ఉన్న ల్యాబ్తో అనుసంధానం చేస్తారు. అక్కడి విద్యార్థులు వర్చువల్గా వీక్షిస్తూ ప్రయోగాలు చేసుకోవచ్చు. ఉదాహరణకు బిట్స్లో ఉండే ఆధునిక పరికరాలను వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్థులు ఉపయోగిస్తూ ప్రయోగాలు చేసేందుకు వీలు కుదురుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్