నిధుల కోసం ఎదురుచూపులు
ప్రాంతీయ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించినా విడుదల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు.
ప్రాంతీయ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణపై కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసిన కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: ప్రాంతీయ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించినా విడుదల కోసం ఎదురుచూపులు తప్పటం లేదు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుకు ఆవల నిర్మించతలపెట్టిన ఈ రోడ్డు భూసేకరణకు అయ్యే వ్యయాన్ని చెరి సగం భరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయి. 158.645 కిలోమీటర్ల ఉత్తర భాగం రోడ్డుకు 4,760 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ మార్గంలో భూమి 95 శాతం వరకు ప్రయివేటు వ్యక్తులదే కావటంతో రూ.2,500 కోట్లవరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. ఈ మార్గంలో భూసేకరణ ప్రక్రియ తుదిదశలో ఉంది. ఒకట్రెండు ప్రాంతాల్లో మినహా అన్ని సర్వేలు పూర్తయ్యాయి. కేంద్రం తుది నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవటమే తరువాయి అని అధికారులు చెబుతున్నారు.. తుది నోటిఫికేషన్లోగా నిధులు సమకూర్చుకోవాలని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
బడ్జెట్లో కేటాయించింది రూ.500 కోట్లే..
ముందస్తు నిర్ణయం ప్రకారం భూసేకరణలో చెల్లించాల్సిన సగం వాటాలోని కొంత మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబరులో లేఖ రాసింది. అయినా గత రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. భూసేకరణ వ్యయంలో సగం.. అంటే సుమారు రూ.1,250 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పన సమయానికి పూర్తి స్పష్టత లేక రూ.500 కోట్లే కేటాయించింది. వీటిని విడుదల చేయడంతో పాటు మరిన్ని నిధులూ కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వారంలో మరోదఫా లేఖ రాసింది. తమ వాటా నిధులు సిద్ధంగా ఉన్నాయని అందులో పేర్కొంది. దక్షిణ భాగం అధ్యయనం కూడా ఇటీవలే పూర్తి అయింది. ఈ మార్గంలో కూడా సుమారు నాలుగు వేల ఎకరాల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఆ మార్గంలో కొంతమేరకు ప్రభుత్వ భూమి ఉండటంతో సేకరణ వ్యయం కాస్త తక్కువగా ఉంటుందని అంచనా. మొత్తమ్మీద భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.రెండు నుంచి రూ.మూడు వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది.
రైతుల గోసకు పరిష్కారం ఏది?
ఉత్తర భాగంలో సేకరించేందుకు ప్రతిపాదించిన భూముల్లో కొందరు రైతులు కట్టుబట్టలతో రోడ్డుపై నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా రైతుల అరిగోసను పట్టించుకున్న నాథుడు లేడు. భువనగిరి, మెదక్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజల నుంచి ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మూడు సార్లు భూములను సేకరించాయి. నష్ట పరిహారం ఇస్తున్నప్పటికీ మార్కెట్లో ఉన్న ధరకు.. ప్రభుత్వం చెల్లించేదానికి మధ్య పొంతన లేకపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి జిల్లాలోని రాయగిరి, కేసారం, మెదక్ జిల్లా కాసాల, దేవులపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజలు భూ సేకరణను అడ్డుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు