యువతకు రాష్ట్రంలో అపార అవకాశాలు
జీవితంలో స్థిరపడాలనుకునే యువతకు రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
మంచి చేస్తేనే ప్రజలు పదికాలాలు గుర్తుంచుకుంటారు
మంత్రి కేటీఆర్
ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ ఫార్మా గ్లాస్ కంపెనీ యూనిట్ నిర్మాణానికి భూమిపూజ
మహబూబ్నగర్ అర్బన్, న్యూస్టుడే: జీవితంలో స్థిరపడాలనుకునే యువతకు రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. జడ్చర్లలో రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవం, మూసాపేట మండలం వేముల శివారులో ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ ఫార్మా గ్లాస్ కంపెనీ యూనిట్ నిర్మాణానికి భూమిపూజతో పాటు భూత్పూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబ్నగర్లో నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగార్హత సాధించిన వారికి ఆఫర్ లెటర్లు అందించారు. మహబూబ్నగర్, జడ్చర్లలలో బహిరంగ సభల్లో కేటీఆర్ మాట్లాడారు.
‘‘పోటీ ప్రపంచంలో స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ ఎంతో ప్రధానం. యువత.. బుక్, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. రాష్ట్రం ఏర్పాటై పదో ఏట అడుగుపెడుతున్నాం. ఒక్కసారి నాటి పరిస్థితులను మననం చేసుకోవాలి. పాలమూరులో 14 రోజులకోసారి మంచినీళ్లు వచ్చిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తదోనని ఎదురుచూసే పరిస్థితి ఉండేది. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేశారా.. లేదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పల్లెలకు పోవాలంటే ఏ గ్రామంలో ఎక్కడ బిందెలు అడ్డుపెట్టి ఆందోళన చేస్తారోనని భయపడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రమంతా మంచినీటి గోస తీరింది. స్వాతంత్య్రం వచ్చాక ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆరే. ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్ అనే స్థాయికి చేరింది. ఇక్కడ ఉదండాపూర్, కరివెన జలాశయాలు కడుతున్నాం. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ ప్రాజెక్టులు పూర్తయితే 67 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. పాలమూరులో చెరువులు, కుంటలు నిండి పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయని నాస్కాం, ఎస్టీపీఐ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్లో గతంలో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు 9.05 లక్షల మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్ మారిందని స్వయంగా సినీ నటుడు రజనీకాంత్ ప్రశంసించారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే న్యూయార్క్లా అనిపిస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రెడ్ స్టిక్కర్ అనే పరిస్థితి నుంచి రెడ్ కార్పెట్ పరిచే స్థాయికి వచ్చాం. 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల రైతుబంధు అందించాం. తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు పోతే వార్త. 10 నిమిషాలు కరెంటు పోతే మెసేజ్లు వస్తున్నాయి. గతంలో మహబూబ్నగర్లో ఎవరైనా చనిపోతే కరెంటోళ్లకు ఫోన్ చేసి అంత్యక్రియల అనంతరం స్నానాలు చేయాల్సి ఉందని.. విద్యుత్తు సరఫరా చేయాలని బతిమిలాడుకునే పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 వైద్య కళాశాలలుండగా.. ఇప్పుడు జిల్లాకొకటి చొప్పున 33 వచ్చాయి. రాష్ట్ర పరిస్థితులు బాగుపడ్డాయా.. లేదా అనేది గుండెలమీద చేయివేసుకొని ఆలోచించాలి. రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో వెయ్యినొక్కటి గురుకులాలు ఏర్పాటు చేశాం. ప్రపంచంతో పోటీపడే పౌరులుగా విద్యార్థులను తయారు చేస్తున్నాం. ఆర్థిక స్తోమత లేని పిల్లలు గురుకుల పాఠశాలల ద్వారా నీట్, ఐఐటీ, ఐఐఎంలలో సీట్లు సంపాదిస్తున్నారు. ఈ ఆనందం ముందు అన్నీ దిగదుడుపే. పదవులు శాశ్వతం కాదు.. మంచి చేస్తేనే పది కాలాలపాటు ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎవరేం మాట్లాడినా.. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పెరిగిన సంపద ‘స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్షిప్’నకు చిహ్నం’’ అని కేటీఆర్ అన్నారు.
కార్యక్రమాల్లో మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, డా.సి.లక్ష్మారెడ్డి, డా.అబ్రహాం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సైయెంట్ సంస్థ ఫౌండర్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ప్రతినిధి కృష్ణ, ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ యజమాని ఎక్బాల్ సింగ్, ఎండీ అక్షయ్కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ కె.నరసింహ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ