Telangana Rains: అరగంటలో.. దూసుకొచ్చిన ఆపద
అర్ధరాత్రి సమయం.. అందరూ ఆదమరిచి నిద్రపోతున్న వేళ.. వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న ఆ ఊరిని వరద చుట్టుముట్టింది. కేవలం అరగంట సమయంలోనే ఊరు మొత్తం మునిగిపోయింది. హాహాకారాలు చేస్తూ.. నిద్ర మేలుకున్న గ్రామస్థులు భీతావహులయ్యారు.
వాగు వరదలో మునిగిన మోరంచపల్లి..
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: అర్ధరాత్రి సమయం.. అందరూ ఆదమరిచి నిద్రపోతున్న వేళ.. వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న ఆ ఊరిని వరద చుట్టుముట్టింది. కేవలం అరగంట సమయంలోనే ఊరు మొత్తం మునిగిపోయింది. హాహాకారాలు చేస్తూ.. నిద్ర మేలుకున్న గ్రామస్థులు భీతావహులయ్యారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పరుగులు తీశారు. సజ్జలు, డాబాలు, చెట్ల పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. దాదాపు తొమ్మిది గంటల పాటు వరదనీటిలో చిగురుటాకుల్లా వణికిపోతూ.. సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. గురువారం ఉదయం 5 గంటలకు ఈ విషయం వెలుగులోకి వచ్చాక అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలకు ఉపక్రమించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం దీనావస్థ ఇది. కుండపోత వర్షాలతో ఈ జిల్లా మొత్తం అతలాకుతలం కాగా.. మోరంచవాగు ఊరిని ముంచెత్తింది. జిల్లాలో బాధితులను రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి రెండు హెలికాప్టర్లను పంపారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎస్పీ కరుణాకర్లు మోరంచపల్లి సమీపానికి చేరుకుని అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. వరదలో చిక్కుకున్న వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా దాదాపు వెయ్యి మందిని పడవల్లో ఒడ్డుకు చేర్చారు. మేడలు, చెట్లపై చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. సుమారు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించారు. గ్రామానికి చెందిన అయిదుగురు వరదలో గల్లంతైనట్లు గ్రామస్థులు తెలిపారు. గొర్కె ఓదిరెడ్డి, ఆయన సతీమణి వజ్రమ్మ, గంగిడి సరోజన, గడ్డం మహాలక్ష్మి వరదలో కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. స్థానిక శ్మశానంలో నిద్రిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. కేవలం అరగంట వ్యవధిలోనే ఊరిని వరద ప్రవాహం చుట్టుముట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. రాత్రంతా వర్షం కురిసినా పెద్దగా వాగు ప్రవాహం లేదు. ఎగువన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట మారేడుకుంట, ముసలమ్మకుంట, పెద్దాపూర్, గణపురం మండలం నగరంపల్లి, ధర్మరావుపేట చెరువుల మత్తళ్లు దూకడం, గండ్లు పడటం వల్ల మోరంచవాగుకు ఒక్కసారిగా భారీగా వరద పోటెత్తింది. సమీపంలోనే ఉండే మోరంచపల్లి గ్రామంలోకి చొచ్చుకువచ్చింది.
ఆరుగురు కూలీలను రక్షించిన బృందం
చిట్యాల, న్యూస్టుడే: వంతెన నిర్మాణ పనుల కోసం వచ్చిన ఆరుగురు కూలీలు మోరంచవాగులో చిక్కుకుపోగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక, నేరేడుపల్లి గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులకు బిహార్ రాష్ట్రం నుంచి కూలీలు వచ్చారు. బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో తాము బస చేసిన ప్రాంతం నుంచి కొంతమంది కూలీలు నైన్పాక గ్రామానికి చేరుకున్నారు. మరో ఆరుగురు మాత్రం బస వద్దే నిద్రించేందుకు ఉపక్రమించారు. ఒక్కసారిగా వాగు ప్రవాహం పెరగడంతో వారు జేసీబీ యంత్రంపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక జడ్పీటీసీ సభ్యుడు సాగర్, ఎంపీడీవో రామయ్య, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. వారు ఎన్డీఆర్ఎఫ్ బృందం, హెలికాప్టర్ను పంపించి బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
రేపు ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర కూడలి సమీపంలో జీడిమెట్ల సర్వే నంబరు 82లో ఎకరా 29 గుంటలు, సర్వే నంబరు 83లో 3 వేల గజాల స్థలాన్ని 2011లో కొన్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెబుతున్నారు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. -
ఉచిత పరీక్షలతో పేద రోగులకు ఊరట
క్యాన్సర్ ఉన్న వారిలో దాని మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) ఎలా ఉందని గుర్తించేందుకు నిమ్స్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మాలిక్యులర్ జెనెటిక్ పరీక్షలు ఉచితంగా చేస్తుండడంతో ఎంతో మంది పేద రోగులకు ఉపశమనం కలుగుతోంది. -
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!